epaper
Tuesday, March 10, 2026
epaper

కొలనూరుకు ఆర్ఓబీ మంజూరు

కొలనూరుకు ఆర్ఓబీ మంజూరు

ఓదేలు కోసం కృషి కొనసాగుతుంది :ఎంపీ వంశీకృష్ణ

ఆర్‌ఎఫ్‌సీఎల్ రామగుండంలో మిస్ మేనేజ్మెంట్‌పై కేంద్రానికి లేఖలు

కాకతీయ, పెద్దపల్లి : కొలనూరు ప్రాంతానికి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ (ఆర్ఓబీ) మంజూరు కావడం స్థానిక ప్రజలకు ఆనందకరమైన విషయమని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ తెలిపారు. కొలనూరు, ఓదేలు ప్రాంతాల్లో రైల్వే గేటు కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.
రైల్వే అధికారులు కొలనూరు ప్రాంతాన్ని సందర్శించిన సమయంలో తాను వారితో కలిసి ప్రత్యక్షంగా పరిశీలన నిర్వహించానని తెలిపారు. ఆ సమయంలో ఓదేలు ప్రాంతానికి కూడా అత్యవసరంగా ఆర్ఓబీ అవసరం ఉందని వివరించినట్లు చెప్పారు. ప్రారంభంలో రైల్వే శాఖ కొలనూరుకు మాత్రమే ఆర్ఓబీ మంజూరు చేసి, ఓదేలు ప్రాంతానికి సాధ్యం కాదని తెలిపిందన్నారు.అయితే ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తాను నిరంతరం ప్రయత్నాలు కొనసాగించడంతో కొలనూరు ప్రాంతంలో రైల్వే శాఖ స్వంత ఖర్చులతో ఆర్ఓబీ నిర్మాణానికి అంగీకరించినట్లు తెలిపారు. అదే విధంగా ఓదేలు ప్రాంతానికి కూడా ఆర్ఓబీ మంజూరు అయ్యేలా కృషి కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రెండు ప్రాంతాల్లో ప్రజల సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కావడానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు.
ఇదిలా ఉండగా, పెద్దపల్లి నియోజకవర్గంలోని ఆర్‌ఎఫ్‌సీఎల్ రామగుండం సంస్థ నిర్వహణపై కూడా ఎంపీ వంశీకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. సంస్థలో మిస్ మేనేజ్మెంట్, నిర్లక్ష్యం జరుగుతోందని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాకు పలుమార్లు లేఖలు రాసినట్లు తెలిపారు. వ్యక్తిగతంగా కలసి సమస్యలను వివరించినప్పటికీ సరైన స్పందన రాలేదని అన్నారు.
ప్రస్తుతం ఆర్‌ఎఫ్‌సీఎల్ రామగుండం సంస్థలో ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించడం లేదని, సుమారు 70 శాతం మాత్రమే ఉత్పత్తి కొనసాగుతోందని పేర్కొన్నారు. సంస్థ హెడ్ ఆఫీస్ ఢిల్లీలో ఉండటంతో స్థానిక సమస్యలపై తగిన శ్రద్ధ ఉండడం లేదని, అందుకే హెడ్ ఆఫీస్‌ను హైదరాబాద్‌కు మార్చాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.గతంలో మూతపడిన ఆర్‌ఎఫ్‌సీఎల్ సంస్థను తిరిగి ప్రారంభించేందుకు మాజీ కేంద్ర మంత్రి జి. వెంకటస్వామి కృషి చేశారని గుర్తుచేశారు. అనంతరం వివేక్ ఎంపీగా ఉన్న సమయంలో కూడా ఎంతో శ్రమించి సంస్థను మళ్లీ ప్రొడక్షన్‌లోకి తీసుకువచ్చారని చెప్పారు. ఈ సంస్థ ద్వారా స్థానిక యువతకు ఉపాధి లభించిందని వివరించారు.రామగుండం ఆర్‌ఎఫ్‌సీఎల్ ద్వారా తెలంగాణకు యూరియా సరఫరా జరగడంతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా ఎరువులు పంపిణీ అయ్యేదని తెలిపారు. ప్రస్తుతం యూరియా నిర్వహణలో గందరగోళం నెలకొన్నదని, ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని ఎంపీ వంశీకృష్ణ స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మున్సిపల్ చైర్మన్‌కు సత్కారం

మున్సిపల్ చైర్మన్‌కు సత్కారం కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంట మండల కేంద్రంలోని...

ఆఫీస్‌లు పరిశుభ్రంగా ఉండాలి

ఆఫీస్‌లు పరిశుభ్రంగా ఉండాలి రికార్డులు, ఫైళ్లు నిబంధనల ప్రకారం భద్రపరచాలి కలెక్టర్ గరిమ అగ్రవాల్ కలెక్టరేట్...

దళిత బంధు సమితి సభ్యుల అరెస్ట్

దళిత బంధు సమితి సభ్యుల అరెస్ట్ కాకతీయ, జమ్మికుంట: హుజురాబాద్ నియోజకవర్గంలో మంత్రి...

సావిత్రిబాయి పూలే సేవలు చిరస్మరణీయం

సావిత్రిబాయి పూలే సేవలు చిరస్మరణీయం కాకతీయ, హుజురాబాద్: పట్టణంలోని జ్యోతిబాపూలే కూడలిలో సావిత్రిబాయి...

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కార్యక్రమం

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కార్యక్రమం -భవిష్యత్తులో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక...

142 పశువులకు ఉచిత గాలికుంటు టీకాలు..

142 పశువులకు ఉచిత గాలికుంటు టీకాలు.. కాకతీయ,శంకరపట్నం: మండలంలోని మొలంగూర్, నల్లా వెంకయ్యపల్లి...

కవిత అరెస్ట్‌పై తెలంగాణ జాగృతి ఆగ్రహం

కవిత అరెస్ట్‌పై తెలంగాణ జాగృతి ఆగ్రహం కాకతీయ, కరీంనగర్: ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల...

భగత్ నగర్ ప్రజల ప్రేమే నా బలం

భగత్ నగర్ ప్రజల ప్రేమే నా బలం డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img