రంజాన్ మాసం సందర్భంగా మైనార్టీలకు నిత్యావసర వస్తువుల పంపిణీ
కాకతీయ, ఖిలా వరంగల్: ఖిలా వరంగల్ తూర్పు కోటలో రంజాన్ మాసం సందర్బంగా బీజేపీ వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు కందిమల్ల మహేష్ ఆధ్వర్యంలో మైనార్టీ సోదరులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పేద కుటుంబాలకు బియ్యం, నూనె, పప్పులు మరియు ఇతర అవసరమైన వస్తువులను అందజేశారు.ఈ సందర్భంగా కందిమల్ల మహేష్ మాట్లాడుతూ రంజాన్ మాసం ప్రేమ, సోదరభావం, సేవాభావానికి ప్రతీక అని అన్నారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా, సౌహార్దంతో జీవించాలని ఆకాంక్షించారు. పేద ప్రజలకు తోడుగా ఉండటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిల్లా కిషోర్, ముడిదే రఘు, బోలుగొడ్డు సతీష్, మెడిశెట్టి రాజేష్, పెసరు కుమారస్వామి, బోలుగొడ్డు అమృత్, రాజేష్, అనిల్, చిరంజీవి, ఏసిరెడ్డి రంజిత్, విజయ్ తదితర నాయకులు, కార్యకర్తలు మరియు మైనార్టీ సోదరులు పాల్గొన్నారు.


