బైక్ అదుపు తప్పి యువకుడు మృతి..!
మూల మలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం
కాకతీయ, దుగ్గొండి : బైక్ అదుపు తప్పి యువకుడు మృతి చెందిన ఘటన దుగ్గొండి మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని తొగర్రాయి గ్రామ శివారు మూల మలుపు వద్ద మంగళవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లబెల్లి మండలం దస్తగిరిపల్లి గ్రామానికి చెందిన పోతరవేణి మనోహర్ (26) మృతి చెందాడు. గిర్నిబావి వైపు నుంచి దుగ్గొండికి వస్తుండగా బైక్ అదుపు తప్పి ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేట ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


