కొమ్మాల గుడి వద్ద యువకులపై దాడి..
నిందితుడిపై కేసు నమోదు
కాకతీయ,గీసుగొండ:కొమ్మాల గుడి వద్ద అకారణంగా ఇద్దరు యువకులపై దాడి చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సీఐడి విశ్వేశ్వర్ తెలిపారు.సీఐ తెలిపిన వివరాల ప్రకారం దుగ్గొండి మండలం దేశాయుపల్లి గ్రామానికి చెందిన తోగరు పవన్ తన సోదరుడు తోగరు సాయి, అతని స్నేహితుడు మామునూరు జయంత్తో కలిసి మార్చి 8న రాత్రి సుమారు 11 గంటల సమయంలో గీసుగొండ మండలంలోని కొమ్మాల గుడికి వెళ్లి దర్శనం చేసుకొని బయటకు వచ్చారు. ఆ సమయంలో జయంత్ తన ఊరి స్నేహితులతో మాట్లాడుతుండగా దుగ్గొండి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన మామునూరి దీక్షిత్ కుమార్ అకారణంగా బీర్ సీసాను పగులగొట్టి తోగరు సాయి పై దాడి చేయడంతో అతని పెదవికి రక్త గాయం అయింది. దాడిని ఆపేందుకు వెళ్లిన తోగరు పవన్పై కూడా నిందితుడు దాడి చేయడంతో అతని ఎడమ భుజానికి తీవ్ర గాయం అయ్యింది. అనంతరం బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందిన తరువాత పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐడి విశ్వేశ్వర్ తెలిపారు.


