epaper
Monday, March 9, 2026
epaper

ప్రగతిలో ముందుండాలి

ప్రగతిలో ముందుండాలి

తాగునీటి సమస్యపై ముందస్తు చర్యలు తీసుకోవాలి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి
ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాలి
ప్రతి ఒక్కరికీ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలి
గ్రామాల అభివృద్ధికి లక్ష్యంతో ముందుకు సాగాలి
అధికారుల‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం

కాక‌తీయ‌, కరీంనగర్ : ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక అమలులో చిగురుమామిడి, సైదాపూర్ మండలాలను రాష్ట్రంలోనే ముందుండేలా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సోమవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లో నిర్వహించిన మండల స్థాయి సన్నాహక సమావేశాల్లో పాల్గొన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక గ్రామాల అభివృద్ధికి గొప్ప అవకాశమని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాల‌న్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, మండల అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.

ఇసుక సరఫరాలో ఇబ్బందులొద్దు

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి లబ్ధిదారులకు త్వరగా గృహప్రవేశాలు కల్పించాలని మంత్రి సూచించారు. నిర్మాణ పనులకు అవసరమైన ఇసుక సరఫరా విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తామని, ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులను పంపే గ్రామాలకు ప్రత్యేక అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రతి వ్యక్తికి సంబంధించిన ఆరోగ్య వివరాలతో హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేసి ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రజల ఆరోగ్యం బాగుంటేనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి దిశానిర్దేశం చేశారు. కార్య‌క్ర‌మంలో లెక్టర్ చిత్రా మిశ్రా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, ఆర్డీవో మహేశ్వర్, డీపీవో జగదీశ్వర్, డీఆర్‌డీవో శ్రీధర్, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, సంక్షేమ అధికారి సరస్వతి, హౌసింగ్ పీడీ శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా, మండలస్థాయి అధికారులు, సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఆగ‌ని ఇసుక అక్రమ రవాణా

ఆగ‌ని ఇసుక అక్రమ రవాణా ట్రాక్టర్లు, గూడ్స్ వాహనాల్లో త‌ర‌లింపు పోలీసులల‌ దాడులు.. నలుగురిపై...

ఎన్టీపీసీకి స్వేచ్ఛ ఇవ్వాలి

ఎన్టీపీసీకి స్వేచ్ఛ ఇవ్వాలి తెలంగాణ ప్ర‌భుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవాలి ప్రాజెక్టుకు అవసరమైన...

పీఎం సూర్య ఘర్ ను స‌ద్వినియోగం చేసుకోవాలి

పీఎం సూర్య ఘర్ ను స‌ద్వినియోగం చేసుకోవాలి ప్రచార రథాన్ని ప్రారంభించిన కలెక్టర్...

గోదావరి పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లు

గోదావరి పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లు ధర్మపురి క్షేత్రానికి రాష్ట్రస్థాయి గుర్తింపు రావాలి మంత్రి అడ్లూరి...

మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట

మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట గల్ఫ్ బాధిత కుటుంబాలకు రూ.5 లక్షలు జ‌గిత్యాల జిల్లాలో 590...

పండుగలకు నిధులు కేటాయించాలి

పండుగలకు నిధులు కేటాయించాలి కాకతీయ, హుజూరాబాద్ : హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలో జరిగే...

బైకు కొనివ్వలేదని విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్య

బైకు కొనివ్వలేదని విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్య కాకతీయ, కరీంనగర్ రూరల్...

జల్ జీవన్ మిషన్‌పై గ్రామ సభ

జల్ జీవన్ మిషన్‌పై గ్రామ సభ నల్లవెంకాయపల్లిలో అవగాహన కార్యక్రమం కాకతీయ, శంకరపట్నం: జల్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img