మహిళల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి
* వార్డ్ కౌన్సిలర్ షరీఫా బేగం-ఖాజ
కాకతీయ, చేర్యాల: మహిళల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని 12వ వార్డు కౌన్సిలర్ మహమ్మద్ షరీఫాబేగం -ఖాజ అన్నారు. సోమవారం మున్సిపాలిటీలోని 12వ వార్డులోని మహిళలకు ప్రభుత్వం ద్వారా అందించిన ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ షరీఫాబేగం మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధిధికారత కోసం కృషి చేస్తుందన్నారు. మహిళల కోసం చేపట్టిన ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు, కల్యాణలక్ష్మీ కాకుండా పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని కౌన్సిలర్ షరీఫాబేగం పేర్కొన్నారు. మహిళా సాధికారత సాధ్యం కావాలంటే సొంతంగా నిర్ణయాలు తీసుకుని ఉన్నత స్థానానికి వెళ్లాలన్నారు. ప్రతీ మహిళా చదువుకొని తన కాళ్ల మీద తాను నిలబడాలని సూచించారు.ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగినప్పుడే అనుకున్న లక్ష్యం సాధ్యమవుతుందని వివరించారు. ప్రభుత్వాలు అందిస్తున్న సహాయాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. మున్సిపాలిటీలో మహిళల ఆర్థికాభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు మున్సిపాలిటీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. మహిళలకు వస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆర్థికంగా బలోపేతం అయినప్పుడే మహిళల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగేందర్, సీఎలు మమత, లత,మున్సిపల్ సిబ్బంది, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


