epaper
Monday, March 9, 2026
epaper

ఆడబిడ్డల ఉసురు తగులుతుంది..!

ఆడబిడ్డల ఉసురు తగులుతుంది..!
పరీక్షల సమయంలోనే ఇళ్లు కూల్చడం దారుణం
బాధితుల బాధను రాజకీయ ఎగ్జిబిషన్ చేశారు
ముఖ్యమంత్రి, జిల్లా మంత్రులు స్పందించాలి
పరిష్కారం వచ్చే వరకు పోరాటం చేస్తాం
ఇళ్లు కూల్చిన చోటే కొత్త ఇళ్లు కట్టివ్వాలి
తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు, మాజీ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ కవిత
వెలుగుమట్ల బాధితులకు ప‌రామ‌ర్శ

కాకతీయ, ఖమ్మం బ్యూరో : వెలుగుమట్ల బాధితుల ఆవేదన చూస్తే కడుపు తరుక్కుపోతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇళ్లను కోల్పోయి రోడ్డున పడిన ఆడబిడ్డల కన్నీళ్లు ప్రభుత్వానికి, రాజకీయ నాయకులకు తగులుతాయని ఆమె తీవ్రంగా వ్యాఖ్యానించారు. వెలుగుమట్ల బాధితులను పరామర్శించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. పిల్లల పరీక్షల సమయంలోనే పుస్తకాలతో సహా ఇళ్లను కూల్చివేయడం అమానుషమని కవిత మండిపడ్డారు. తల్లిదండ్రులు పిల్లల పరీక్షల గురించి ఆందోళన చెందుతున్న సమయంలో రాత్రికి రాత్రే బుల్డోజర్లతో ఇళ్లను నేలమట్టం చేశారని అన్నారు. ఈ ఘటన పేదలపై జరుగుతున్న అన్యాయానికి నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. బాధితుల ఆవేదనను కొన్ని రాజకీయ పార్టీలు ఎగ్జిబిషన్‌లా చూస్తూ వెళ్లిపోయాయని కవిత విమర్శించారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కాకుండా రాజకీయ లాభాల కోసం మాత్రమే కొందరు నాయకులు అక్కడికి వచ్చారని అన్నారు. బాధితుల సమస్య పరిష్కారమయ్యే వరకు వారితో కలిసి పోరాటం చేస్తామని ఆమె స్పష్టం చేశారు. తాను కేవలం పరామర్శించడానికి మాత్రమే రాలేదని, బాధితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం వచ్చేలా ప్రయత్నిస్తానని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ, ధర్మ సమాజ్ పార్టీ, ప్రజా సంఘాలతో పాటు జాగృతి సంస్థ కూడా బాధితులకు అండగా ఉంటుందని తెలిపారు. సమస్యకు శాశ్వత పరిష్కారం వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు.

ఇళ్లు కూల్చిన చోటే కొత్త ఇళ్లు

బాధితుల ఇళ్లను ఎక్కడ కూల్చివేశారో అదే చోట వారికి కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. వేరే ప్రాంతాలకు వెళ్లమంటే వెళ్లబోమని బాధితులు చెబుతున్నారని, ప్రభుత్వం వారి డిమాండ్‌ను గౌరవించాలని అన్నారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఎవరూ బాధితులను పరామర్శించలేదని ఆమె విమర్శించారు. జిల్లా కలెక్టర్ కూడా ఇప్పటివరకు అక్కడికి రాకపోవడం దారుణమని అన్నారు. ముందుగా కలెక్టర్ అక్కడికి వెళ్లి పరిస్థితులను పరిశీలించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడుస్తున్నాయని, కానీ పెద్దల అక్రమ భవనాలపై మాత్రం ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని కవిత ఆరోపించారు. పేదల హక్కులను కాపాడేందుకే ఈ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

స్టేడియంలో సింథటిక్ ట్రాక్

స్టేడియంలో సింథటిక్ ట్రాక్ ఫ‌లించిన మంత్రి తుమ్మల కృషి రూ.8.50 కోట్లతో నిర్మాణం.. శరవేగంగా...

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారించాలి

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారించాలి ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించాలి అర్హులకు న్యాయం జరిగేలా బాధ్యతగా...

పోడు భూమిలో కందకాలు..

పోడు భూముల్లో కందకాలు మనస్థాపంతో రైతు ఆత్మహత్యాయత్నం తిప్పగుట్టలో ఉద్రిక్త పరిస్థితి.. అటవీ శాఖ...

మార్కెఫెడ్ ద్వారా మొక్కజొన్నలు కొనాలి

మార్కెఫెడ్ ద్వారా మొక్కజొన్నలు కొనాలికొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి మద్దతు ధర 2400...

కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు..!

కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు..! కొత్తూరు తండాలో 20 కుటుంబాలు పార్టీ తీర్థం కాకతీయ, కారేపల్లి...

సీఎం రిలీఫ్ ఫండ్‌తో లక్ష సాయం..!

సీఎం రిలీఫ్ ఫండ్‌తో లక్ష సాయం..! అనారోగ్యంతో ఉన్న వార్డు సభ్యుడికి చెక్కు...

గ్యాస్ ధరలు తగ్గించాలని దిష్టిబొమ్మ దహనం..!

గ్యాస్ ధరలు తగ్గించాలని దిష్టిబొమ్మ దహనం..! పి ఓ డబ్ల్యూ ఆధ్వర్యంలో నిరసన కాకతీయ,...

బాలికలకు హెచ్‌పీవీ టీకాలు అందించాలి

బాలికలకు హెచ్‌పీవీ టీకాలు అందించాలి గర్భాశయ క్యాన్సర్ నివారణకు టీకా కీలకం అర్హులైన బాలికలను...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img