సీఎం రిలీఫ్ ఫండ్తో లక్ష సాయం..!
అనారోగ్యంతో ఉన్న వార్డు సభ్యుడికి చెక్కు అందజేత
కాకతీయ, కొత్తగూడెం : అనారోగ్యంతో బాధపడుతున్న వార్డు సభ్యుడు గొగ్గిల సుధీర్కు సీఎం రిలీఫ్ ఫండ్ కింద లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. సోమవారం దగల పెద్ద తండా సర్పంచ్ లావుడియా పూర్ణచందర్ రావు చెక్కును సుధీర్కు అందించారు. శస్త్రచికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిన వెంటనే స్పందించి సహాయం అందించేందుకు కృషి చేసిన సర్పంచ్కు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ లావుడియా పూర్ణ మాట్లాడుతూ ఖమ్మం జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహకారంతో తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎల్ ఓ సి ద్వారా ఈ సహాయం అందించామని తెలిపారు. అవసరమైన సమయంలో ప్రజలకు అండగా నిలవడం తమ బాధ్యత అని అన్నారు. సాయం అందుకున్న గొగ్గిల సుధీర్ సర్పంచ్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అజ్మీర మోహన్, ధరావత్ హాలియా, యువనాయకులు నూనావత్ అశోక్, సోమన్న, బానోతు అనిల్, బానోత్ రాజేష్, భూక్యా సాగర్, జాటోతు చిన్ని తదితరులు పాల్గొన్నారు.


