గ్యాస్ ధరలు తగ్గించాలని దిష్టిబొమ్మ దహనం..!
పి ఓ డబ్ల్యూ ఆధ్వర్యంలో నిరసన
కాకతీయ, ఖమ్మం : పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల మహిళా సంఘం పి ఓ డబ్ల్యూ ఆధ్వర్యంలో సోమవారం ఖమ్మం నగరంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు, మహిళలు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పి ఓ డబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ శిరోమణి మాట్లాడుతూ మహిళా దినోత్సవం రోజునే గ్యాస్ ధరలు పెంచడం మహిళలకు ఇచ్చిన బహుమతిలా ఉందని విమర్శించారు. గ్యాస్ ధరల పెంపుతో సామాన్య ప్రజలపై మరింత ఆర్థిక భారం పడుతుందని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉందన్నారు. వెంటనే పెంచిన గ్యాస్ ధరలను తగ్గించి పేదలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి ఓ డబ్ల్యూ జిల్లా సహాయ కార్యదర్శి ప్రతాపనేని శోభ, జిల్లా ఉపాధ్యక్షులు తుడుం ఝాన్సీ, సుజాత, స్వాతి, లక్ష్మి, అనురాధ తదితరులు పాల్గొన్నారు.


