epaper
Monday, March 9, 2026
epaper

మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట

మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట

గల్ఫ్ బాధిత కుటుంబాలకు రూ.5 లక్షలు

జ‌గిత్యాల జిల్లాలో 590 మంది మహిళలకు మొదటి విడతలో లబ్ధి

మిగిలినవారికి ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో అవకాశం

ధర్మపురిలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ముస్లిం మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ

కాక‌తీయ‌, జ‌గిత్యాల : మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సోమవారం ధర్మపురి పట్టణంలోని షాదీ ఖానాలో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ముస్లిం మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగిత్యాల జిల్లాలో కుట్టు మిషన్ల కోసం 590 మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారని మొదటి విడతలో వారికి మిషన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. మిగిలిన వారికి కూడా 99 రోజుల ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా అందజేస్తామని పేర్కొన్నారు. మైనార్టీ రుణాల కోసం అర్హులు దరఖాస్తు చేసుకుంటే సంబంధిత శాఖలతో చర్చించి రుణాలు మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక విజయవంతం చేయాలి

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కరించడంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ముఖ్యంగా పారిశుధ్యం, పెండింగ్ ఫైళ్ల పరిష్కారం వంటి అంశాలను ప్రాధాన్యతగా తీసుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పిలుపునిచ్చారు.

గల్ఫ్ బాధితులకు ప్రభుత్వం అండ

ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. గల్ఫ్ బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తున్నామని, ధర్మపురి నియోజకవర్గానికి చెందిన 15 మంది కుటుంబాలకు రూ.75 లక్షలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లాలో 250 మంది గల్ఫ్ బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సహాయం అందించినట్లు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాలను వినియోగించుకుని మహిళలు ఆర్థికంగా ఎదగాలని ధర్మపురి మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి సూచించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఆగ‌ని ఇసుక అక్రమ రవాణా

ఆగ‌ని ఇసుక అక్రమ రవాణా ట్రాక్టర్లు, గూడ్స్ వాహనాల్లో త‌ర‌లింపు పోలీసులల‌ దాడులు.. నలుగురిపై...

ప్రగతిలో ముందుండాలి

ప్రగతిలో ముందుండాలి తాగునీటి సమస్యపై ముందస్తు చర్యలు తీసుకోవాలి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం...

ఎన్టీపీసీకి స్వేచ్ఛ ఇవ్వాలి

ఎన్టీపీసీకి స్వేచ్ఛ ఇవ్వాలి తెలంగాణ ప్ర‌భుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవాలి ప్రాజెక్టుకు అవసరమైన...

పీఎం సూర్య ఘర్ ను స‌ద్వినియోగం చేసుకోవాలి

పీఎం సూర్య ఘర్ ను స‌ద్వినియోగం చేసుకోవాలి ప్రచార రథాన్ని ప్రారంభించిన కలెక్టర్...

గోదావరి పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లు

గోదావరి పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లు ధర్మపురి క్షేత్రానికి రాష్ట్రస్థాయి గుర్తింపు రావాలి మంత్రి అడ్లూరి...

పండుగలకు నిధులు కేటాయించాలి

పండుగలకు నిధులు కేటాయించాలి కాకతీయ, హుజూరాబాద్ : హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలో జరిగే...

బైకు కొనివ్వలేదని విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్య

బైకు కొనివ్వలేదని విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్య కాకతీయ, కరీంనగర్ రూరల్...

జల్ జీవన్ మిషన్‌పై గ్రామ సభ

జల్ జీవన్ మిషన్‌పై గ్రామ సభ నల్లవెంకాయపల్లిలో అవగాహన కార్యక్రమం కాకతీయ, శంకరపట్నం: జల్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img