కృషి పట్టుదల క్రమశిక్షణతో ఏదైనా సాధించగలం
* కడవేర్గు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజమణి
* పాఠశాలలో వైభవంగా స్వయం పరిపాలన దినోత్సవం
కాకతీయ,చేర్యాల: మండలంలోని కడవేర్గు గ్రామంలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థులు స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తరగతి గదుల్లో తోటి విద్యార్థులకు విద్యాబోధన చేసి ఆకట్టుకున్నారు. విద్యా బోధన చేయడంలో ఉపాధ్యాయులు ఎంత కష్టపడుతున్నారో ఈరోజు తెలుసుకున్నామని, గురువుల మాటలు వింటే లక్ష్యాన్ని అందుకోవచ్చని పలువురు విద్యార్థులు అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజమణి మాట్లాడుతూ..విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత వెలికి తీసేందుకు ఇలాంటి గొప్ప కార్యక్రమాలు ఉపకరిస్తాయన్నారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివినప్పుడే అనుకున్న లక్ష్యం సాధిస్తారని అన్నారు.కృషి,పట్టుదల, క్రమశిక్షణ ఉంటే జీవితంలో సాధించలేనిది ఏదీ ఉండదని ప్రధానోపాధ్యాయులు రాజమణి విద్యార్థులకు సూచించారు.స్వయం పరిపాలన దినోత్సవం లో భాగంగా జల్లి హర్షవర్ధన్ జిల్లా విద్యాశాఖ అధికారిగా, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా పొన్న లావణ్య, కార్యాలయ సబార్డినెట్ గా సంపత్,శశిధర్ తో పాటు ఇతర విద్యార్థులు ఉపాధ్యాయులుగా, వివిధ అధికారులుగా తమ కర్తవ్యాన్ని వేషధారణంగా గావించి ఒక్కరోజు స్వపరిపరిపాలన దినోత్సవాన్ని కొనసాగించారు.విద్యార్థులే ఉపాధ్యాయులుగా చక్కటి పాఠశాలను బోధించారు. స్వయం పరిపాలన దినోత్సవం లో భాగంగా డీఈవోగా జల్లి హర్షవర్ధన్ పాఠశాలను సందర్శించి పరిశీలించడం, తనిఖీలు చేయడం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజమణి, ప్రధానోపాధ్యాయుల కాంతికృష్ణ, రమేష్, కృష్ణమూర్తి, చంద్రశేఖర్, మలిపెద్ది రామకృష్ణ, అరుణ, సాజిదా, మమత, ప్రీతి చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు.


