epaper
Saturday, March 7, 2026
epaper

దళిత, గిరిజనుల బడ్జెట్ ఖర్చులో నిర్లక్ష్యం

దళిత, గిరిజనుల బడ్జెట్ ఖర్చులో నిర్లక్ష్యం

చేవెళ్ల డిక్లరేషన్ అమలు చేయాలి
డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి

కాకతీయ, గజ్వేల్ : రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధుల చట్టం కింద కేటాయించిన బడ్జెట్‌ను ఖర్చు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం, వివక్షత ప్రదర్శిస్తోందని దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి విమర్శించారు. శుక్రవారం గజ్వేల్ అంబేద్కర్ భవన్‌లో డిబిఎఫ్ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధుల బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని, అంబేద్కర్ అభయహస్తం పథకాన్ని ప్రారంభించాలని, చేవెళ్ల డిక్లరేషన్‌ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దాసరి ఏగొండ స్వామి మాట్లాడుతూ… 2025 – 26 బడ్జెట్‌లో దళితుల ప్రత్యేక నిధి కింద రూ 40,231 కోట్లు కేటాయించినప్పటికీ కేవలం రూ 16,374 కోట్లు మాత్రమే విడుదల చేసి, అందులోనూ రూ 6,726 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ఇది దళితుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కార్యదర్శి బ్యాగరి వేణు మాట్లాడుతూ బడ్జెట్ కేటాయింపులు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని అన్నారు. ఎస్సీల జనాభా ప్రకారం 18 శాతం రిజర్వేషన్లు పెంచుతామని ఇచ్చిన హామీని ప్రభుత్వం మరిచిందని విమర్శించారు. ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ 17,154 కోట్లు కేటాయించినప్పటికీ కేవలం రూ 3,431 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు తెలిపారు. బీఎస్పీ నాయకుడు కనక ప్రసాద్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల రాజ్యాంగబద్ధ హక్కుల సాధన కోసం బడ్జెట్ నిధుల కేటాయింపులు, ఖర్చులపై ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో బెజగామ ప్రభాకర్, చంద్రం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అస్తవ్యస్తంగా డ్రైనేజీ

అస్తవ్యస్తంగా డ్రైనేజీ కాకతీయ, చేర్యాల: చేర్యాల మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ...

శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని కేసీఆర్‌కు ఆహ్వానం

శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని కేసీఆర్‌కు ఆహ్వానం - మార్చి 8 నుంచి...

కవిత పాదయాత్రలో పాల్గొన్న కొట్టాల యాదగిరి ముదిరాజ్

కవిత పాదయాత్రలో పాల్గొన్న కొట్టాల యాదగిరి ముదిరాజ్ - అలిపిరి నుంచి తిరుమల...

గజ్వేల్ ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీలో 99 రోజుల కార్యక్రమాలకు శ్రీకారం

గజ్వేల్ ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీలో 99 రోజుల కార్యక్రమాలకు శ్రీకారం - మున్సిపల్ కార్యాలయం...

నాచారం గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు వివేక్ వెంకటస్వామికి ఆహ్వానం

నాచారం గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు వివేక్ వెంకటస్వామికి ఆహ్వానం - మాజీ ఎమ్మెల్యే...

విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తిని పెంచుతాయి

విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తిని పెంచుతాయి * నర్సయ్యపల్లి పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన...

పేదోడి కళ్ళల్లో సంతోషం చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

పేదోడి కళ్ళల్లో సంతోషం చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం - అర్హులైన ప్రతి...

పోచయ్య మృతికి వంటేరు సంతాపం

పోచయ్య మృతికి వంటేరు సంతాపం కాకతీయ, గజ్వేల్ : గజ్వేల్ మండలంలోని సింగాటం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img