ఆడపిల్ల పెళ్ళికి అవనీ స్కీమ్
– విన్నుత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మర్రిపల్లి సర్పంచ్ సుజాత
– ఆడపిల్ల పెళ్లికి 10116/- ఆర్ధిక సహాయం….
కాకతీయ, దుగ్గొండి: గ్రామంలోని ఆడపిల్లలందరు తన తోబుట్టువులని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తనవంతు సహకారంగా మర్రిపల్లి గ్రామ సర్పంచ్ డ్యాగం సుజాత సుధాకర్ లు తాము ఎన్నికయ్యాక గ్రామంలో జరిగిన మొదటి ఆడపిల్ల పెళ్లికి 10116/- అందించి అవనీ స్కీమ్ కు శ్రీకారం చుట్టారు. మర్రిపల్లి గ్రామంలో గురువారం కత్తుల రాజమ్మ సాంబయ్యల కుమార్తె
కత్తుల శ్రీజ గణేష్ ల వివాహం జరగగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సందర్బంగా పేదింటి ఆడపిల్ల పెళ్ళికి తాము ఇచ్చిన హామీ మేరకు అవనీ స్కీమ్ పేరుతో 10116/-లు అందించారు. ఐదేళ్ల పాటు గ్రామంలో జరగనున్న ప్రతి ఆడపిల్ల పెళ్లికి ఈ స్కీమ్ ద్వారా సహాయాన్ని అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ బోయిని రంజిత్, వార్డు సభ్యులు గాజు శివాజీ, మహ్మదాపురం మాజీ ఎంపీటీసీ సౌడారపు సారంగపాణి, నాయకులునర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ డ్యాగం శివాజీ తదితరులు పాల్గొన్నారు.


