epaper
Thursday, March 5, 2026
epaper

విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తిని పెంచుతాయి

విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తిని పెంచుతాయి

* నర్సయ్యపల్లి పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

* విద్యార్థులు ధరించిన పాత్రలను నిజ జీవితంలో సాకారం చేసుకోవాలి

* మద్దూర్ మండల సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు శనిగరం సత్యనారాయణ

 కాకతీయ,మద్దూర్ : మద్దూర్ మండల పరిధిలోని నర్సయ్యపల్లి గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో గురువారం విద్యార్థులు స్వపరిపాలన దినోత్సవం నిర్వహించారు. పదో తరగతి విద్యార్థి టీ.ఆకాష్ డిఈఓ గా.జి. మాధవి ప్రధానోపాధ్యాయులుగా,ఇతర విద్యార్థులు ఉపాధ్యాయులుగా వివిధ అధికారులుగా వేషధారణ గావించి ఒకరోజు స్వపరిపాలన కొనసాగించారు. విద్యార్థులే ఉపాధ్యాయులు, అధికారులు, నాయకులు అయిన వేళ స్వపరిపాలన దినోత్సవం పలువురిని అలరించింది. ఉపాధ్యాయులుగా విద్యార్థులకు విద్యాబోధనను అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మద్దూరు మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు, నర్సయ్యపల్లి గ్రామ సర్పంచ్ శనిగరం సత్యనారాయణ, ఏఏపీసి చైర్మన్ కనకలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ సత్యనారాయణ మాట్లాడుతూ. విద్యార్థులు చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని పేర్కొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న సర్పంచ్ సత్యనారాయణ

కృషి పట్టుదల, క్రమశిక్షణ ఉంటే జీవితంలో సాధించలేనిది ఏదీ ఉండదని విద్యార్థులకు సూచించారు.విద్యార్థుల్లో దాగి ఉన్న సృజ నాత్మకత వెలికి తీసేందుకు ఇలాంటివి ఉపకరిస్తాయన్నారు.విద్యా బోధన చేయడంలో ఉపాధ్యాయులు ఎంత కష్టపడుతున్నారో ఈరోజు తెలుసుకున్నామని, గురువుల మాటలు వింటే లక్ష్యాన్ని అందుకోవచ్చని పలువురు విద్యార్థులు అభిప్రాయం వ్యక్తం చేశారు.విద్యార్థుల్లో పాఠశాల చదువు పట్ల ఆసక్తిని పెంచుతాయని, వారు ధరించిన పాత్రలను నిజ జీవితంలో సాకారం చేసుకోవాలని ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్.రాజేశం, ఉపాధ్యాయులు జి. ఆంజనేయులు,బి. నర్సింహులు,కె రత్నమాల జి. సుభాషిని, బి. రజినీకాంత్, బి. భాగ్యలక్ష్మి, వార్డు సభ్యులు రాగుల బాల నర్సయ్య తో పాటు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

నాచారం గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు వివేక్ వెంకటస్వామికి ఆహ్వానం

నాచారం గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు వివేక్ వెంకటస్వామికి ఆహ్వానం - మాజీ ఎమ్మెల్యే...

పేదోడి కళ్ళల్లో సంతోషం చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

పేదోడి కళ్ళల్లో సంతోషం చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం - అర్హులైన ప్రతి...

పోచయ్య మృతికి వంటేరు సంతాపం

పోచయ్య మృతికి వంటేరు సంతాపం కాకతీయ, గజ్వేల్ : గజ్వేల్ మండలంలోని సింగాటం...

నాచారంలో కూల్చిన చోటే అంబేడ్కర్ గద్దె పునర్నిర్మాణం

నాచారంలో కూల్చిన చోటే అంబేడ్కర్ గద్దె పునర్నిర్మాణం - అర్ధరాత్రి కూల్చివేతపై గ్రామస్తుల...

అంగన్వాడి బలోపేతానికి సంపూర్ణ సహకారం

అంగన్వాడి బలోపేతానికి సంపూర్ణ సహకారం * 7వ వార్డు కౌన్సిలర్ పోతుగంటి ప్రసాద్ కాకతీయ,చేర్యాల:...

ఆయకట్టును స్థిరీకరించాలని మంత్రి ఉత్తమ్ కు ఎంపీ చామల వినతి

ఆయకట్టును స్థిరీకరించాలని మంత్రి ఉత్తమ్ కు ఎంపీ చామల వినతి రైతన్నలకు అండగా...

రంగేసి.. చిందేసి..

రంగేసి.. చిందేసి.. * అంబరాన్నంటిన హోలీ సంబురాలు * రంగుల్లో మునిగితేలిన కాకతీయ,చేర్యాల: చేర్యాల పట్టణంతో...

కాంగ్రెస్ హామీల్లో పూర్తిగా వైఫల్యం- వంటేరు ప్రతాప్ రెడ్డి

కాంగ్రెస్ హామీల్లో పూర్తిగా వైఫల్యం- వంటేరు ప్రతాప్ రెడ్డి - హైదరాబాద్ బ్రాండ్‌కు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img