epaper
Thursday, March 5, 2026
epaper

పంటల సాగులో

పంటల సాగులో
డ్రోన్లను వినియోగించుకోవాలి

కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్

డార్మెటరీ పనులు త్వరగా పూర్తి చేయాల‌ని ఆదేశాలు

ఐన‌వోలు తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల తనిఖీ

మల్లికార్జునస్వామికి ప్ర‌త్యేక పూజ‌లు

కాకతీయ, హనుమకొండ : వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా రైతులు ఎక్కువ లాభాలు పొందవచ్చని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. ముఖ్యంగా పంటల సాగులో డ్రోన్ల వినియోగం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. గురువారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో నాబార్డ్ పథకం కింద వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఆధ్వర్యంలో రైతు సేవా సహకార సొసైటీ (నందనం)కు డ్రోన్ల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతు సేవా సహకార సొసైటీ (నందనం), పీఏసీఎస్ నర్సంపేట, పీఏసీఎస్ నెల్లికుదురు సొసైటీలకు అందించనున్న మూడు డ్రోన్ల వివరాలను వ్యోమిక్ డ్రోన్స్ సంస్థ ప్రతినిధులు హనుమ, జగదీష్ కలెక్టర్‌కు వివరించారు.

రైతులు సాంకేతికతను వినియోగించుకోవాలి

డ్రోన్ల ద్వారా ఎరువులు, పురుగుమందులను సమర్థవంతంగా పిచికారీ చేయవచ్చని తెలిపారు. దీని వల్ల సమయం, ఖర్చు రెండూ తగ్గుతాయని, రైతులు ఈ సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకోవాలని సూచించారు. డ్రోన్ల వినియోగంతో పంటల ఉత్పత్తి కూడా పెరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. అదేవిధంగా రైతు సేవా సహకార సొసైటీ (నందనం) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రూరల్ మార్ట్‌ను కలెక్టర్ సందర్శించి అక్కడ విక్రయానికి ఉంచిన వివిధ వస్తువులను పరిశీలించారు. రూరల్ మార్ట్ నిర్వహణ బాగుందని, ఇదే విధంగా కొనసాగించాలని సూచించారు. స్థానిక ప్రజలు ఈ మార్ట్‌ను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

మల్లికార్జునస్వామి దర్శనం

అనంతరం ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయాన్ని కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, పూజారులు పూర్ణకుంభం, మంగళ వాయిద్యాలతో ఆలయ మర్యాదలతో కలెక్టర్‌కు ఘన స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి శేష వస్త్రాలు, ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థానం ప్రాంగణంలో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) నిధులతో నిర్మాణంలో ఉన్న డార్మెటరీ హాల్ పనులను కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణం అసంపూర్తిగా ఉండటంపై వివరాలు తెలుసుకుని పనులు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల ఆకస్మిక తనిఖీ

ఐనవోలు మండలంలోని తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో రికార్డు రూమ్‌ను పరిశీలించి భూ భారతి దరఖాస్తులు, సాదా బైనామా కేసులపై తహసీల్దార్ విక్రమ్ కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు సంబంధించిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) అమలుపై సమీక్షించి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులపై వివరాలు తెలుసుకున్నారు. కార్యాలయానికి అదనపు గదులు అవసరమని ఎంపీడీవో నర్మద కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, అంచనా ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలని సూచించారు. కార్యక్రమంలో టెస్కాబ్ మాజీ చైర్మన్ రవీందర్ రావు, నాబార్డ్ జిల్లా అభివృద్ధి అధికారి చంద్రశేఖర్, వరంగల్ అధికారి చైతన్య, హనుమకొండ, వరంగల్ జిల్లాల డీసీఓలు సంజీవరెడ్డి, నీరజ, హనుమకొండ జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్, ఏడీఏ ఆదిరెడ్డి, సహకారశాఖ ఏరియా అధికారి జగన్మోహన్ రావు, స్థానిక సర్పంచులు రఘువంశీ, రాజు, తహసీల్దార్ విక్రమ్ కుమార్, ఎంపీడీవో నర్మద తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మలగుట్ట వెనుక మంటలు

కొమ్మలగుట్ట వెనుక మంటలు కాకతీయ, గీసుగొండ: మండలంలోని కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి...

రాష్ట్రస్థాయి కరాటే క్రీడల్లో జిల్లా పరిషత్ పాఠశాలఏటూరునాగారం విద్యార్థుల ప్రతిభ

*రాష్ట్రస్థాయి కరాటే క్రీడల్లో జిల్లా పరిషత్ పాఠశాలఏటూరునాగారం విద్యార్థుల ప్రతిభ *బంగారు పతకం...

ఆడపిల్ల పెళ్ళికి అవనీ స్కీమ్

ఆడపిల్ల పెళ్ళికి అవనీ స్కీమ్ - విన్నుత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మర్రిపల్లి...

అధికారుల సమన్వయంతో కొమ్మాల జాతర విజయవంతం

అధికారుల సమన్వయంతో కొమ్మాల జాతర విజయవంతం *గీసుగొండ తహసిల్దార్ ఎండి రియాజుద్దీన్.. కాకతీయ, గీసుగొండ:అన్ని...

బాధితుల్లో నమ్మకం పెంచాలి

బాధితుల్లో నమ్మకం పెంచాలి ప్ర‌జ‌ల విశ్వాసాన్ని పొందాలి సీపీ సీపీ సన్ ప్రీత్ సింగ్ ధర్మసాగర్...

కమనీయం వెంకటేశ్వరస్వామి కళ్యాణం

కమనీయం వెంకటేశ్వరస్వామి కళ్యాణం కాకతీయ,నర్సింహులపేట: మండల కేంద్రంలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై కొలువుదీరిన చిన్న...

ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు

ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్ కాకతీయ, ఖిలా వరంగల్: చింతల్...

బాధిత కుటుంబానికి పరామర్శ

బాధిత కుటుంబానికి పరామర్శ కాకతీయ, పెద్దవంగర : మండల కేంద్రంలోని గట్లకుంట గ్రామానికి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img