epaper
Thursday, March 5, 2026
epaper

పదేళ్ల సమస్యకు కదలిక..!

పదేళ్ల సమస్యకు కదలిక..!
అద్దె భవనం నుంచి ఆర్టీఏ తరలింపున‌కు చర్యలు
టెక్స్టైల్ పార్క్‌లో తాత్కాలిక కంటైనర్ ఏర్పాటు
మంచినీటి కోసం బోర్.. వేచిచూడటానికి షెడ్లు..
విద్యుత్ లైన్ లేక తరలింపులో ఆలస్యం
శాశ్వత భవనానికి రూ.8.50 కోట్ల ప్రతిపాదనలు
‘కాకతీయ’ కథనానికి స్పందించిన మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌
త‌క్ష‌ణం త‌ర‌లింపున‌కు అధికారుల‌కు ఆదేశాలిచ్చిన మంత్రి

కాకతీయ, రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో దాదాపు పదేళ్లుగా కొనసాగుతున్న ఆర్టీఏ కార్యాలయ సమస్యకు పరిష్కారం దిశగా కదలిక ప్రారంభమైంది. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌లో అద్దె భవనంలో కొనసాగుతున్న ఆర్టీఏ కార్యాలయాన్ని టెక్స్టైల్ పార్క్‌లోని సొంత స్థలానికి తరలించేందుకు రవాణా శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఇరుకైన గదులు, సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో సిబ్బంది, వాహన వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను “దూరం… భారం..” అనే కథనం కాకతీయ దినపత్రిక వెలుగులోకి తీసుకువ‌చ్చిన విష‌యం పాఠ‌కుల‌కు విదిత‌మే. అధికారులు స్పందించి కార్యాలయ తరలింపు ప్రక్రియను వేగవంతం చేశారు.

ఆర్టీఏ కార్యాల‌యానికి కేటాయించిన‌ టెక్స్టైల్ పార్క్ స్థ‌లంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక కంటైన‌ర్‌

టెక్స్టైల్ పార్క్‌లో తాత్కాలిక ఏర్పాట్లు

ఆర్టీఏ కార్యాలయాన్ని టెక్స్టైల్ పార్క్‌కు తరలించే ప్రక్రియలో భాగంగా ఆ శాఖకు కేటాయించిన ఐదు ఎకరాల స్థలంలో అధికారులు తాత్కాలికంగా ఒక కంటైనర్ ఏర్పాటు చేశారు. కార్యాలయ అవసరాల కోసం మంచినీటి సౌకర్యం కల్పించేందుకు బోర్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే వాహన వినియోగదారులు వేచి ఉండేందుకు ప్రత్యేక షెడ్ల నిర్మాణానికి పనులు ప్రారంభించారు. అయితే అక్కడ ఇప్పటివరకు విద్యుత్ సరఫరా లేకపోవడం కార్యాలయాన్ని పూర్తిస్థాయిలో తరలించడంలో ప్రధాన అడ్డంకిగా మారింది. సంబంధిత శాఖలతో సమన్వయం చేసి విద్యుత్ లైన్ ఏర్పాటు చేసే ప్రక్రియను అధికారులు ప్రారంభించినట్లు సమాచారం. విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన వెంటనే కార్యాలయాన్ని పూర్తిగా టెక్స్టైల్ పార్క్‌కు తరలించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

నూత‌న కార్యాల‌యం ఆవ‌ర‌ణ‌లో బోరు వేసిన దృశ్యం

శాశ్వత భవనానికి ప్రతిపాదనలు

ఆర్టీవో కార్యాలయానికి శాశ్వత సొంత భవనం నిర్మాణం కోసం సుమారు రూ.8.50 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపినట్లు జిల్లా రవాణా శాఖ అధికారులు తెలిపారు. రవాణా శాఖకు ఇప్పటికే సొంత స్థలం ఉన్నప్పటికీ భవన నిర్మాణానికి అవసరమైన నిధులు అందకపోవడంతో ఇప్పటివరకు కార్యాలయం అద్దె భవనంలోనే కొనసాగుతోంది. రాబోయే బడ్జెట్‌లో ఈ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా స్పందించారు. రవాణా శాఖకు చెందిన సొంత భవనాల నిర్మాణం కోసం చర్యలు తీసుకుంటామని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా సేవలను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారుల‌తో చెప్ప‌డం గ‌మ‌నార్హం. ప్రస్తుతం తాత్కాలిక ఏర్పాట్లతో సేవలను ఒకే ప్రాంగణంలో అందుబాటులోకి తీసుకువచ్చి, అనంతరం పూర్తి స్థాయి సొంత భవన నిర్మాణాన్ని చేపట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. అవసరమైన మౌలిక సదుపాయాలు త్వరగా కల్పిస్తే ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు గణనీయంగా తగ్గుతాయని భావిస్తున్నారు. రవాణా శాఖలో చేపడుతున్న ఈ చర్యలు జిల్లా ప్రజలకు మెరుగైన సేవలకు దారితీసే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఫిబ్ర‌వ‌రి 28న కాక‌తీయ దిన‌ప‌త్రిక‌లో వ‌చ్చిన క‌థ‌నం

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఇసుక ట్రాక్టర్ స్వాధీనం .. నిందితుడిపై కేసు

ఇసుక ట్రాక్టర్ స్వాధీనం .. నిందితుడిపై కేసు కాకతీయ, కరీంనగర్ : అక్రమ...

గంగస్నానం ఖ‌ర్చులు తానే భ‌రిస్తా..

గంగస్నానం ఖ‌ర్చులు తానే భ‌రిస్తా.. కాకతీయ, జమ్మికుంట : ఇల్లంతకుంట మండలం రాచపల్లి–మల్లన్నపల్లి...

ప్రజల విశ్వాసంపైనే ప‌ద‌వులు

ప్రజల విశ్వాసంపైనే ప‌ద‌వులు రాహుల్ గాంధీపై విమర్శలు తగదు కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు...

గ్రీన్ సిటీగా మారుస్తా

గ్రీన్ సిటీగా మారుస్తా కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంట మున్సిపల్ చైర్మన్‌గా మొలుగు...

హర్దీప్ సింగ్ రాజీనామా చేయాలి

హర్దీప్ సింగ్ రాజీనామా చేయాలి కాకతీయ, కరీంనగర్ : మహిళా కాంగ్రెస్ రాష్ట్ర...

పొన్నం క్యాంప్ ఆఫీస్ వద్ద హోలీ సంబురాలు

పొన్నం క్యాంప్ ఆఫీస్ వద్ద హోలీ సంబురాలు కాకతీయ, కరీంనగర్ : హోలీ...

కన్నూర్‌లో ఉచిత పశువైద్య శిబిరం

కన్నూర్‌లో ఉచిత పశువైద్య శిబిరం కాకతీయ, హుజురాబాద్ : కమలాపూర్ మండలం కన్నూర్...

సైబర్ మోసాల‌పై అవగాహన

సైబర్ మోసాల‌పై అవగాహన కాకతీయ,శంకరపట్నం: మండలంలోని కాచాపూర్ గ్రామంలో కేశవపట్నం పోలీస్ స్టేషన్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img