epaper
Saturday, November 15, 2025
epaper

ఎరువుల సంక్షోభంపై బీఆర్ఎస్ వినూత్న నిరసన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా నెలకున్న ఎరువుల కొరతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గన్ పార్క్ వద్ద మాట్లాడుతూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోకుండా అసెంబ్లీని తమకు అనుకూలంగా నడిపిస్తుందని ఆరోపించారు.

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కనీసం 15 రోజులపాటు జరగాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏ అంశాన్నైనా సభలో పెట్టినా, తాము సమాధానం చెప్పడానికి సిద్ధంగానే ఉన్నామని స్పష్టం చేశారు. వ్యవసాయం నుంచి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వరకు ఏ విషయానికైనా సమాధానం ఇవ్వడానికి తాము వెనకడుగు వేయమని అన్నారు.

డిస్క్వాలిఫై అయిన ఎమ్మెల్యేల అంశంపై స్పీకర్ తీసుకునే నిర్ణయాన్ని గౌరవిస్తామని కేటీఆర్ తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీని తనకు అనుకూలంగా నడిపించడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు.

రైతుల సమస్యలపై మాట్లాడకుండా, ముఖ్యంగా ఎరువుల కొరతపై దృష్టి పెట్టకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. “బీఆర్‌ఎస్ పాలనలో పది సంవత్సరాలు ఎప్పుడూ రైతులు లైన్లలో నిలబడి ఎరువుల కోసం ఇబ్బంది పడలేదు. కానీ ఇప్పుడు రైతులు ఆధార్ కార్డులు, చెప్పులు లైన్లో పెట్టి వర్షంలోనూ నిలబడాల్సి వస్తోంది” అని ఆయన ప్రశ్నించారు.

భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతుల పరిస్థితి దారుణంగా మారిందని, ఇప్పటికే 600 మందికి పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 75 లక్షల మంది రైతులు ఈరోజు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ సమస్యలపై అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.

అదేవిధంగా, కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 వాగ్దానాల అమలులో వైఫల్యం, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వంటి అంశాలపై కూడా చర్చ జరగాలని కేటీఆర్ అన్నారు. ప్రజల సమస్యలను పక్కనబెట్టి, తమకు అనుకూలమైన రెండు మూడు విషయాలపైనే కాంగ్రెస్ మాట్లాడుతోందని విమర్శించారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సహా అన్ని అంశాలపై సమాధానం చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు. “అది పీసీ గోష్ కమిషన్ కాదు, కాంగ్రెస్ పార్టీ వేసుకున్న పీసీసీ గోష్ కమిషన్ మాత్రమే” అంటూ ఆయన ఎగతాళి చేశారు. ఈ నిరసనతో బీఆర్‌ఎస్ రైతుల సమస్యలను మరింతగా ప్రాధాన్యం చేకూర్చుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌ జూబ్లీహిల్స్ పీఠంపై హ‌స్తం పార్టీ జెండా ఉప ఎన్నిక గెలుపుతో...

హీరో నాగార్జునపై కామెంట్స్ చేస్తూ మంత్రి సురేఖ ట్వీట్…

హీరో నాగార్జునపై కామెంట్స్ చేస్తూ మంత్రి సురేఖ ట్వీట్... https://twitter.com/iamkondasurekha/status/1988313863826379169 కాకతీయ, వరంగల్ సిటీ...

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించిన స‌ర్వే సంస్థ‌లు అన్నింట్లోనూ అధికార పార్టీకి స్పష్టమైన...

మార్కెట్ లైసెన్స్ జారీ ఆలస్యంపై కలెక్టర్ సీరియస్

మార్కెట్ లైసెన్స్ జారీ ఆలస్యంపై కలెక్టర్ సీరియస్ మార్కెట్ అధికారులు, రైస్ మిల్లర్లతో...

మాగంటి సునిత ఎమోష‌న‌ల్ వీడియో..!

మాగంటి సునిత ఎమోష‌న‌ల్ వీడియో..! జూబ్లీహిల్స్ ఓట‌ర్ల‌కు విజ్ఞ‌ప్తి.. కాక‌తీయ‌, హైదరాబాద్ : జూబ్లీహిల్స్...

కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది

https://twitter.com/TeluguScribe/status/1987795147560722497 కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది ఫేక్ స్లిప్పుల‌ను ఎన్నిక‌ల అధికారికి...

అద్దె చెల్లించలేదు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు తాళం..!

అద్దె చెల్లించలేదు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు తాళం..! https://twitter.com/TeluguScribe/status/1987768671163629993 కాక‌తీయ‌, వెబ్‌డెస్క్ : అద్దె చెల్లించకపోవడంతో...

క‌వి అందె శ్రీ క‌న్నుమూత‌

క‌వి అందె శ్రీ క‌న్నుమూత‌ కాక‌తీయ‌, హైద‌రాబాద్ : వాగ్గేయ‌కారుడు, క‌వి అందె...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img