ర్యాగింగ్ ఘటనపై
సీబీఐ విచారణ జరిపించాలి
కాకతీయ, మరిపెడ : మరిపెడ మండలంలోని ట్రైబల్ వెల్ఫేర్ బాలుర గురుకులంలో జరిగిన ర్యాగింగ్ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు గంధసిరి. జ్యోతిబసు ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు. బుధవారం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని ట్రై ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలను సంఘం ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గురుకులంలో ప్రిన్సిపాల్ లేకపోవడం మూలంగానే జూనియర్లపై సీనియర్ల విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల పాఠశాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నా చాలా చోట్ల ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని అన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ బాలుర గృహంలో వెలుగు చూసిన ర్యాగింగ్ ఘటన పట్ల ఆర్ సి ఓ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మరిపెడ మండల కార్యదర్శి పెద్దపులి బాసు, నాయకులు వీర నాగన్న, విగ్నేష్, మహేష్, నవీన్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.


