epaper
Tuesday, March 3, 2026
epaper

కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
మెడికల్ బోర్డు నిర్వహణలో నిర్లక్ష్యం
డిస్మిస్ ఉద్యోగులకు మరో అవకాశం ఇవ్వాలి
కమిటీ సమావేశాలు వాయిదా వేయడం సరికాదు
యాజమాన్యం వైఖరిపై ఏఐటీయూసీ ఆగ్రహం

కాకతీయ, కొత్తగూడెం : సింగరేణి కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య డిమాండ్ చేశారు. కొత్తగూడెంలోని శేషగిరి భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ యాజమాన్యం కార్మిక సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సింగరేణి సంస్థకు నూతన సి అండ్ ఎండీగా జ్యోతిబుద్ధ ప్రకాష్ బాధ్యతలు స్వీకరించడం సంతోషకరమేనని పేర్కొన్న రంగయ్య, అయితే స్ట్రక్చర్ కమిటీ సమావేశాల్లో ఒప్పుకున్న సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిటీ పేరుతో కాలయాపన చేయడం మానుకోవాలని యాజమాన్యాన్ని హెచ్చరించారు. నిబంధనల ప్రకారం ప్రతి రెండు నెలలకు ఒకసారి డైరెక్టర్ స్థాయి సమావేశం, ప్రతి మూడు నెలలకు ఒకసారి సి అండ్ ఎండీ స్థాయి సమావేశం గుర్తింపు సంఘంతో నిర్వహించాల్సి ఉందని గుర్తుచేశారు. అయితే యాజమాన్యం ఈ సమావేశాలను పదేపదే వాయిదా వేస్తోందని విమర్శించారు. ఇది కార్మికుల సమస్యల పరిష్కారాన్ని ఆలస్యం చేస్తోందని తెలిపారు. మెడికల్ బోర్డు సక్రమంగా నిర్వహించకపోవడంతో అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. వైద్య సేవల్లో జాప్యం వల్ల కార్మికుల ఆరోగ్యం దెబ్బతింటోందని చెప్పారు. సొంత ఇల్లు పథకాన్ని అమలు చేయాలని, మారుపేర్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఆదాయ పన్నును కోల్ ఇండియా తరహాలో యాజమాన్యమే భరించాలని సూచించారు. డిస్మిస్ అయిన ఉద్యోగులకు మరోసారి అవకాశం ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సెంట్రల్ కార్యదర్శి వంగ వెంకట్, కార్పొరేట్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్.వి.రమణమూర్తి, కొత్తగూడెం ఏరియా సహాయ కార్యదర్శి గట్టయ్య, నాయకులు చందయ్య తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

దాతల సాయం కోసం ఎదురుచూపు!

దాతల సాయం కోసం ఎదురుచూపు! పుట్టుకతో అంగవైకల్యం.. ఇప్పుడు షుగర్ వ్యాధి కాటు ఆపరేషన్‌కు...

బతికుండగానే ‘చంపేసి’ కోట్లు దోచేశారు!

బతికుండగానే ‘చంపేసి’ కోట్లు దోచేశారు! భద్రాచలం ఎల్ ఐసీ శాఖలో రూ. 1.52...

మహాసభలను జయప్రదం చేయండి

మహాసభలను జయప్రదం చేయండి సీపీఐ(ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ నేత‌ కందగట్ల సురేందర్ పిలుపు కాకతీయ,...

అభివృద్ధికి మారుపేరు తుమ్మల

అభివృద్ధికి మారుపేరు తుమ్మల ప్రతిపక్షాలు తుమ్మల ప్రతిష్ఠపై బురదజల్లే ప్రయత్నం ప్రజలు కర్రుకాల్చి వాత...

రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నేతలు

రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నేతలు కాకతీయ, కొత్తగూడెం రూరల్: రాహుల్...

విశిష్ట సేవలు చిరస్మరణీయం

విశిష్ట సేవలు చిరస్మరణీయం కాకతీయ, కొత్తగూడెం రూరల్ : లక్ష్మీదేవిపల్లి మండల సూపరింటెండెంట్‌గా...

శ్మ‌శాన వాటిక సమస్యపై కలెక్టర్‌కు వినతి

శ్మ‌శాన వాటిక సమస్యపై కలెక్టర్‌కు వినతి ఆక్రమణలు తొలగించాలని సర్పంచ్ మంద కరుణ...

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి అధికారుల‌కు క‌లెక్ట‌ర్ ఆదేశాలు కలెక్టరేట్‌లో ప్రజల అర్జీల స్వీకరణ కాకతీయ,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img