జమ్మికుంట పట్టణం లో హోలీ సంబురాలు
డిగ్రీ కళాశాల మైదానం లో బ్రదర్స్ టీమ్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు
ముఖ్య అతిధిగా మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ కుమార్
కాకతీయ, జమ్మికుంట: జమ్మికుంట పట్టణం లోని డిగ్రీ కళాశాల మైదానంలో బ్రదర్ టీమ్ ఆధ్వర్యంలో బిగ్గెస్ట్ హోలీ ఈవెంట్ అత్యంత వైభవంగా జరిగింది. జమ్మికుంటలో మునుపెన్నడూ లేని విధంగా ఏర్పాటుచేసిన రెయిన్ డాన్స్, డీజే సౌండ్ పాటలు ,ప్రత్యేకంగా ఆకర్షణీయంగా నిలిచాయి. మండుతున్న ఎండల్లో చల్లని చినుకుల మధ్య యువతి యువకులు ,చిన్నపిల్లల సైతం రంగులు చల్లుకుంటూ, అదిరిపోయే పాటలకు స్టెప్పులు లేస్తూ ఉత్సాహంగా గడిపారు. ఈ భారీ వేడుకల్లో జమ్మికుంట పట్టణమంతా రంగుల మయంతో కోలాహలంగా జరిగింది. ఈ మెగా రంగోలి ఉత్సవానికి బ్రదర్స్ టీం, ఆర్గనైజర్ పాతకాల ప్రవీణ్ ,సింగిరెడ్డి రంజిత్ రెడ్డి ,ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ కుమార్ ,వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ ,జమ్మికుంట పట్టణ సిఐ రామకృష్ణ గౌడ్ ,ఎస్సై నాగరాజు ,గట్టు సాయిరాం ,సాముల వెంకట్ రెడ్డి ,కొత్త గణపతి రెడ్డి ,దేవులపల్లి నవీన్ ,జమ్మికుంట యువతి యువకులు పాల్గొన్నారు.

విలాసాగర్ గ్రామంలో హోలీ వేడుకలు
జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామం లో సర్పంచ్ గరిగంటి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ,గ్రామ చౌరస్తా లో హోలీ వేడుకలను నిర్వహించరు. డీజే పాటలతో, రైన్ డాన్స్లతో యువతీ యువకులు హోలీ పండుగ ను నిర్వహించరు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ అరెల్లి దివ్య, వేలుపుల లక్ష్మి, మొరే మధు, గణేష్ మాజీ సర్పంచ్ లు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


