epaper
Tuesday, March 3, 2026
epaper

తమ్మినేనిపై అభిశంసన… వామపక్షంలో ప్రకంపనలు

తమ్మినేనిపై అభిశంసన… వామపక్షంలో ప్రకంపనలు
కేంద్ర కమిటీ ఘాటు హెచ్చరిక
ఆర్థిక వ్యవహారాలపై అభ్యంతరాలు
కుటుంబ ప్రాధాన్యంపై విమర్శలు
పక్షపాత నిర్ణయాలపై అసంతృప్తి
రహస్య లేఖ బహిర్గతంతో వర్గపోరు స్పష్టత
రాష్ట్ర మహాసభల ముందు ఉద్రిక్తత

కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో: తెలంగాణ వామపక్ష రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు కేంద్ర కమిటీ జారీ చేసిన అభిశంసన లేఖ బయటకు రావడం పార్టీలో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ లేఖలో రాష్ట్ర స్థాయి కీలక నేత తమ్మినేని వీరభద్రంపై పలు ఆరోపణలు ప్రస్తావించబడినట్లు పార్టీ వర్గాల్లో సమాచారం వెలుగులోకి వచ్చింది. పార్టీ రాజ్యాంగంలో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఇచ్చే అధికారిక హెచ్చరికనే అభిశంసనగా పరిగణిస్తారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు భావించినప్పుడు విచారణ అనంతరం కేంద్ర కమిటీ ఈ నిర్ణయం తీసుకుంటుంది. తమ్మినేనిపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన తర్వాతే ఈ చర్య చేపట్టినట్లు తెలుస్తోంది.

లేఖలోని ఆరోపణలు ఇవే..

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ఆర్థిక లావాదేవీల విషయంలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఖమ్మం జిల్లాకు చెందిన కొందరు నాయకులతో కలిసి నిర్వహించిన వ్యవహారాల్లో పారదర్శకత లోపించిందనే విమర్శలు వచ్చినట్లు చెబుతున్నారు. అలాగే కుటుంబ సభ్యులకు ప్రాధాన్యం ఇచ్చారనే ఆరోపణలు కూడా లేఖలో ఉన్నట్లు సమాచారం. పార్టీలో తనకు అనుకూలమైన వర్గానికే పదవులు కేటాయించి, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన వారిని పక్కన పెట్టారనే ఫిర్యాదులు కూడా కేంద్ర కమిటీ దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన నేతగా మరింత జాగ్రత్తగా ఉండాల్సిందని లేఖలో సూచించినట్లు చెబుతున్నారు.

లేఖ బహిర్గతంపై ఆందోళన

ఇలాంటి అంతర్గత పత్రాలు సాధారణంగా బయటకు రావు. కానీ ఈసారి లేఖ బహిర్గతం కావడం పార్టీలో వర్గపోరును బహిరంగం చేసింది. తమ్మినేని అనుచరులు మాత్రం వ్యతిరేక వర్గమే ఉద్దేశపూర్వకంగా లీక్ చేసిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర కార్యదర్శి స్థాయి నేతపై కేంద్ర కమిటీ ఘాటు అభిప్రాయాలు వ్యక్తం చేయడం, అది బయటపడడం పార్టీ ప్రతిష్టకు దెబ్బతీసిందని సీనియర్ నాయకులు ఆందోళన చెందుతున్నారు. తమ్మినేని ప్రస్తుతం అనారోగ్య కారణాలతో కొంతకాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ఈ పరిణామం ఆయన పదవిలో కొనసాగడంపై అనుమానాలు రేకెత్తించింది. త్వరలో జరగబోయే రాష్ట్ర మహాసభల ముందు ఈ వివాదం మరింత ప్రాధాన్యం సంతరించుకునే అవకాశం ఉంది. క్రమశిక్షణ, అంతర్గత ప్రజాస్వామ్యాన్ని తమ బలంగా చెప్పుకునే వామపక్ష పార్టీలో ఇలాంటి పరిణామం చోటుచేసుకోవడం రాజకీయంగా మాత్రమే కాక సిద్ధాంతపరంగానూ చర్చకు దారి తీసింది. పార్టీ నాయకత్వం ఈ అంశాన్ని ఎలా పరిష్కరిస్తుందో అన్నదానిపై అందరి దృష్టి నిలిచింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

హైడ్రా ప్రజావాణికి 42 ఫిర్యాదులు

హైడ్రా ప్రజావాణికి 42 ఫిర్యాదులు చెరువుల ఎఫ్‌టీఎల్ పరిధిలోనే ఆక్రమణలు కోర్టు కేసులున్నా నిర్మాణాలు ప్రగతినగర్...

రాహుల్ గాంధీతో ఇనుగాల దంప‌తుల భేటీ

రాహుల్ గాంధీతో ఇనుగాల దంప‌తుల భేటీ గాంధీ కుటుంబానికి సంబంధించిన పెయిటింగ్‌ను జ్ఞాపిక‌గా...

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img