విద్యార్థులకు వాహన సౌకర్యం కల్పించిన వెంకన్న నాయక్
సేవా భావాన్ని అభినందించిన హెచ్ఎం నరేందర్
కాకతీయ, నెల్లికుదురు: మారుమూల ప్రాంతాల నుండి పాఠశాలకు రాకపోకలలో ఇబ్బందులు పడుతున్న మండలంలోని పార్వతమ్మ గూడెం విద్యార్థుల సౌకర్యార్థం ఒక (వాన్) వాహనాన్ని లైబ్రేరియన్ భూక్యా వెంకన్న సోమవారం దాతృత్వంగా సమకూర్చడం విద్యార్థులకు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వాహనం అందుబాటులోకి రావడంతో దూర ప్రాంతాల విద్యార్థులు సమయానికి పాఠశాలకు హాజరవుతూ, విద్యను నిరంతరంగా కొనసాగించేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ముఖ్యంగా మారుమూల గ్రామాల విద్యార్థుల చదువుకు ఇది ఒక ప్రోత్సాహకరమైన అడుగుగా నిలుస్తుందన్నారు విద్యార్థుల అభివృద్ధికి సమాజం అందరూ తోడ్పడాలని వెంకన్న నాయక్ పిలుపునిచ్చారు అనంతరం ఎంఈఓ రాందాస్, హెచ్ఎం నరేందర్ లు మాట్లాడుతూ వెంకన్న నాయక్ అందించిన సేవాభావాన్ని ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరి కొంతమంది ముందుకు వచ్చి విద్యార్థులకు సహకారాలు అందించాలని, ఈ సందర్భంగా వెంకన్ననాయక్ ను ఎంఈఓ అభినందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ప్రవీణ్ నాయక్, వెంకటరత్నం, రంజిత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.


