బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సర్పంచ్
కాకతీయ, పెద్దవంగర: మండల కేంద్రానికి చెందిన కూతురు రోశయ్య (91) అనారోగ్యంతో ఆదివారం రాత్రి మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ ముద్దసాని పారిజాత సురేష్ సోమవారం ఆయన నివాసానికి వెళ్లి మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారి దుఃఖంలో భాగస్వామ్యమయ్యారు. వృద్ధుడి మరణం గ్రామానికి తీరని లోటని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచిస్తూ అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వినోద్, వార్డు సభ్యులు సుంకరి ఓంకార్, బోగోజు సురేష్ బాబు, ముద్దసాని రవి, చిలుక సంపత్, సీనియర్ నాయకులు ఎండీ జానీ, శ్రీనివాస్ రెడ్డి, యాకరాజు, మహేందర్, సంపత్, వెంకన్న, మల్లికార్జున్, జోగయ్య, క్రాంతి, సందీప్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


