ఘనంగా రేణుకా ఎల్లమ్మ కళ్యాణం
కాకతీయ, మేడ్చల్ మల్కాజిగిరి : గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని ఈస్ట్ ఇంద్ర నెహ్రు నగర్లో శ్రీరేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ట కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈనెల 25వ తేదీ నుంచి మార్చి 1 వరకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.


