గోదావరి నది పుష్కర ఘాట్ ల ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేయాలి.
పుష్కర ఘాట్ లను పరిశీలించిన :: జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్
కాకతీయ, ఏటూరునాగారం :ములుగు జిల్లా మంగపేట మండలం లో గోదావరి నది పుష్కర ఘాట్ ల ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.శుక్రవారం ఏటూరు నాగారం, మంగపేట మండలాలలోని చుంచుపల్లి , మల్లూరు, పోదుమూరు, రామన్నగూడెం, ముళ్ళ కట్ట పుష్కర ఘాట్ లను పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూలై 2027 లో నిర్వహించనున్న గోదావరి నది పుష్కరాల సందర్భంగా ములుగు జిల్లాలోని ఏర్పాటు చేస్తున్న పుష్కర ఘాట్ల నిర్మాణాలు, మరమ్మత్తు పనులు, భక్తుల కోసం ఏర్పాటు చేయవలసిన సౌకర్యాలు తదితర అంశాలపై సమగ్ర ప్రతిపాదనలను సిద్ధం చేసి వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు.
గోదావరి నదీ తీర ప్రాంతంలో పుష్కరాల సందర్భంగా భక్తులకు సౌకర్యాలు కల్పించేలా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని, ముఖ్యంగా ప్రతి ఘాట్ వద్ద భక్తులకు త్రాగునీరు, లైటింగ్, మరుగుదొడ్లు, రవాణా మార్గం, పార్కింగ్ స్థలాలు, ప్రత్యేక వైద్య శిబిరాలు ఇతర సౌకర్యాలు కల్పించడానికి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ సి హెచ్ మహేందర్ జి, తహసిల్దార్ రవీందర్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు


