మహిళ అదృశ్యం కేసు నమోదు చేసిన గీసుగొండ పోలీసులు
కాకతీయ, గీసుగొండ: గీసుగొండ మండలంలో ఓ మహిళ అదృశ్యమైన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు సీఐ డి. విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం ఆరూరి లక్ష్మి (56) ఈ నెల 19వ తేదీన తన కొడుకుతో మనస్పర్థలు రావడంతో వరంగల్ మహానగర పాలక సంస్థ 15వ డివిజన్ మొగిలిచర్లలో నివసిస్తున్న తన తమ్ముడి ఇంటికి వెళ్లింది 20వ తేదీన ప్రతిపాకలోని తన కూతురు ఇంటికి వెళ్తున్నట్లు చెప్పి బయలుదేరిన ఆమె అక్కడికి చేరుకోలేదు కుటుంబ సభ్యులు ఆ రోజు నుంచి బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో గీసుగొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు అదృశ్యమైన మహిళ ఎత్తు సుమారు 5 అడుగులు, చామనచాయ రంగులో ఉంటారని పేర్కొన్నారు ఆమె గురించి ఎటువంటి సమాచారం తెలిసిన వారు గీసుగొండ పోలీసులను సంప్రదించాలని కోరారు.


