epaper
Monday, March 2, 2026
epaper

ప్రజావాణిలో వినతుల వెల్లువ

ప్రజావాణిలో వినతుల వెల్లువ

ఉమ్మడి జిల్లాలో సమస్యలపై అధికారుల ఫోకస్

నిర్ణీత గడువులో పరిష్కారం చేయాలని క‌లెక్ట‌ర్ల ఆదేశాలు

కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్/పెద్ద‌ప‌ల్లి /జ‌గిత్యాల‌ /రాజ‌న్న సిరిసిల్ల : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాల్లో ప్రజల నుంచి విన‌తులు వెల్లువెత్తాయి. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో సోమవారం జరిగిన గ్రీవెన్స్‌కు భారీగా ప్రజలు తరలివచ్చి తమ వినతులను అధికారుల ముందుంచారు. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు స్వయంగా అర్జీలు స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు తక్షణ చర్యలపై కఠిన ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా నిర్ణీత గడువులో పరిష్కరించాలని స్పష్టం చేస్తూ సమస్యల పరిష్కారంలో జాప్యం సహించబోమని హెచ్చరించారు.

కరీంనగర్ లో 367 వినతులు

కరీంనగర్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ కలిసి 367 దరఖాస్తులు స్వీకరించారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. అత్యధికంగా కరీంనగర్ నగరపాలక సంస్థకు సంబంధించిన 41, గృహ నిర్మాణ శాఖకు చెందిన 37 వినతులు నమోదయ్యాయి. ప్రజావాణి దరఖాస్తులను ప్రాధాన్యంతో పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

పెద్దపల్లిలో భూ సమస్యలు, అక్రమ నిర్మాణాలపై ఆదేశాలు

పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ డి.వేణుతో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అసైన్మెంట్ భూముల పట్టాలు, అక్రమ నిర్మాణాల తొలగింపు, పట్టాదారు పుస్తకాల జారీ వంటి సమస్యలపై వచ్చిన వినతులను సంబంధిత అధికారులకు పంపిస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా వేగంగా పరిష్కరించాలని స్పష్టం చేశారు.

రాజన్న సిరిసిల్లలో 154..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రజల నుండి 154 దరఖాస్తులు స్వీకరించారు. రెవెన్యూ శాఖకు అత్యధికంగా 72 వినతులు వచ్చాయి. గత ప్రజావాణిలో వచ్చిన అర్జీల పరిష్కారంపై అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రతి దరఖాస్తును నిర్ణీత గడువులో పరిష్కరించాలని ఆదేశించారు.

జగిత్యాలలో 36 ఫిర్యాదులు

జగిత్యాల కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ప్రజల నుండి 36 ఫిర్యాదులు స్వీకరించారు. అర్జీలపై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఫిర్యాదుదారుల సమస్యలను సానుకూలంగా పరిశీలించి చట్టపరంగా న్యాయం చేయాలని ఆదేశించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img