కాకతీయ, ములుగు : మల్లంపల్లి మండల కేంద్రంలోని మీసేవ కేంద్రాలను ఈ – డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ ఆకస్మిక తనిఖీ చేశారు. మీసేవ కేంద్రాలను ప్రజలకు ఇప్పుడు అందుబాటులో ఉండి ఈఏస్డీ గైడ్లైన్స్ ప్రకారం మీ సేవ కేంద్రాన్ని నడపాలని సూచించారు. ఆపరేటర్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి అన్ని రకాల మీసేవ, భూభారతి తదితర ఆన్లైన్ సర్వీస్ లను ప్రజలకు అందించాలని సూచించారు.
సెంటర్లో తప్పకుండా సిటిజెన్ చార్టర్ తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. మండల ప్రజలు ఆధార్ సేవల గురించి ఇబ్బందులు పడుతున్న విషయమై కొత్త ఆధార్ సెంటర్ ని మల్లంపల్లి మండల కేంద్రంలో అతి త్వరలో ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. కళ్యాణ లక్ష్మి బర్త్, డెత్ సర్టిఫికెట్లు ఎలాంటి తప్పులు లేకుండా నమోదు చేయాలన్నారు.
మీసేవ ఆపరేటర్లు ప్రజల పట్ల మర్యాదపూర్వకముగా ఉంటూ అన్ని రకాల ఆన్లైన్ సేవలను అందించాలని ఆదేశించారు. ముఖ్యంగా నిర్ణీత రుసుము కంటే ఎక్కువ రుసుము దరఖాస్తుదారుడు నుంచి తీసుకున్నట్లయితే సదరు సెంటర్ పై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మీసేవ జిల్లా మేనేజర్ పోలోజు విజయ్, సేవ సెంటర్ నిర్వాహకులు పాల్గొన్నారు.


