epaper
Monday, March 2, 2026
epaper

తుదిదశలో ‘అనులేఖ’కు నిరాశ‌

తుదిదశలో ‘అనులేఖ’కు నిరాశ‌
చివ‌రి ద‌శ‌లో చేజారిన ఎనఎస్‌యూఐ అధ్యక్ష పదవి
ఫైనల్ లిస్టులో చోటు దక్కినా హైకమాండ్ నిర్ణయంలో మార్పు
రాజస్థాన్ దళిత నేత వినోద్ జఖాడ్‌కు బాధ్యతలు
వరుసగా రెండోసారి నిరాశలో తెలంగాణ యువనేత

కాకతీయ, న్యూఢిల్లీ : క‌రీంన‌గ‌ర్ జిల్లా కేంద్రానికి చెందిన యువ కాంగ్రెస్ నాయ‌కురాలు అనులేఖ బుసకు నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎనఎస్‌యూఐ) జాతీయ అధ్యక్ష పదవి తుదిదశలో చేజారింది. కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంస్థలో కీలకమైన ఈ పదవికి నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో చివరి వరకు పోటీలో నిలిచినప్పటికీ, చివరికి రాజస్థాన్‌కు చెందిన దళితవర్గ నేత వినోద్ జఖాడ్‌కు హైకమాండ్ అవకాశం కల్పించింది. రాహుల్ గాంధీ నేతృత్వంలో నిర్వహించిన ఇంటర్వ్యూలలో దేశవ్యాప్తంగా 15 మంది నేతలను పరిశీలించగా, చివరి దశలో ముగ్గురిని ఎంపిక చేశారు. ఆ ముగ్గురిలో తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన అనులేఖ బుస కూడా ఉండటం విశేషం. మహిళ, ఓబీసీ కోటా అంశాలు తనకు అనుకూలిస్తాయని భావించినప్పటికీ, సామాజిక సమీకరణాల దృష్ట్యా హైకమాండ్ వినోద్ జఖాడ్ వైపు మొగ్గుచూపింది. ఇదే పదవికి గతంలో కూడా తుదిదశలో చేరిన అనులేఖకు వరుసగా రెండోసారి నిరాశ ఎదురైంది. అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్న నేపథ్యంలో ఆమెకు రాష్ట్ర లేదా జాతీయ స్థాయిలో మరింత ప్రాధాన్యత కలిగిన బాధ్యతలు అప్పగించే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.క‌రీంన‌గ‌ర్ జిల్లా ప్రస్తుతం అనులేఖ ఎనఎస్‌యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ, కేరళ రాష్ట్ర ఇంచార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం కేంద్రంగా జరిగిన తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న అనులేఖ, విద్యార్థి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి జాతీయ స్థాయికి చేరుకున్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో కూడా ఆమె పాల్గొని ప్రత్యేక గుర్తింపు పొందారు.

అంతర్జాతీయ స్థాయికి ఎంపికైన తెలంగాణ యువనేత

ఇదిలా ఉండగా, అంతర్జాతీయ రాజకీయ నాయకత్వ శిక్షణ కార్యక్రమానికి అనులేఖ బుస ఎంపిక కావడం మరో విశేషం. కొన్రాడ్ అడెనౌర్ స్కూల్ ఫర్ యంగ్ పొలిటిషయన్స నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ముగ్గురు ఎంపిక కాగా, కాంగ్రెస్ నుంచి అనులేఖ ఒక్కరే ఎంపికయ్యారు. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా ఆసియా దేశాల యువ రాజకీయ నాయకులతో కలిసి ప్రజాస్వామ్యం, పరిపాలన, విధానాల రూపకల్పనపై శిక్షణ పొందనున్నారు. తొలి దశలో ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు ఫిలిప్పీన్స్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం శ్రీలంక సహా ఇతర దేశాల్లో కూడా పర్యటించనున్నారు. జాతీయ అధ్యక్ష పదవి చేజారినప్పటికీ, అంతర్జాతీయ స్థాయిలో ఎంపిక కావడం అనులేఖ రాజకీయ ప్రస్థానానికి కొత్త దిశగా భావిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img