కొమ్మాల జాతర సైకిల్ స్టాండ్ వేలం..
*రూ.3 లక్షలు పలికిన బిడ్..
*గత సంవత్సరం కంటే రూ.40 వేల అధిక ఆదాయం..
కాకతీయ, గీసుగొండ : కొమ్మాల జాతరలో నిర్వహించే సైకిల్ స్టాండ్కు కొమ్మాల గ్రామపంచాయతీ కార్యాలయంలో ఎంపీఓ పాక శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేలంపాటలో రూ.3,00,000/-ల అత్యధిక బిడ్ నమోదైంది. గత సంవత్సరం పలికిన రూ.2,60,000/-తో పోలిస్తే ఈ ఏడాది గ్రామపంచాయతీకి రూ.40 వేల అదనపు ఆదాయం సమకూరింది. గత సంవత్సరం ద్విచక్ర వాహనాల పార్కింగ్ టికెట్ రూ.30గా ఉండగా ఈసారి రూ.50కు పెంచారు. ఆటోలకూ రూ.50, కార్లకు రూ.100 చొప్పున పార్కింగ్ టికెట్ నిర్ణయించారు. మార్చి 02/03/2026 నుండి 17/03/2026 వరకు జాతర కాలానికి సైకిల్ స్టాండ్ నిర్వహణకు అనుమతి ఇవ్వనున్నారు. నియమ నిబంధనలు అతిక్రమిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎంపీఓ పాక శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొమ్మాల సర్పంచ్ కన్నెబోయిన యమున ప్రవీణ్ యాదవ్, సూర్య తండా సర్పంచ్ రాఘవేంద్ర,ఉప సర్పంచ్ బి. శివ కుమార్,పంచాయతీ కార్యదర్శి శంకర్ రావు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.


