ఉపాధి హామీ కూలీల హాజరు శాతం పెంచాలి
కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
వెనుకబడిన మండలాలపై ప్రత్యేక దృష్టి
లేబర్ బడ్జెట్ లక్ష్య సాధనకు క్షేత్రస్థాయి పర్యటనలు
పనులను వేగంగా ప్రారంభించి ఆన్లైన్లో నమోదు చేయాలి
కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : జిల్లాలో వెనుకబడిన మండలాల్లో ఉపాధి హామీ కూలీల హాజరు శాతం పెరిగేలా వారం రోజుల్లో తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలుపై అదనపు కలెక్టర్ లెనిన్ వత్సవ్ టోప్పోతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లేబర్ బడ్జెట్ లక్ష్యాలను సాధించేందుకు అధికారులు గ్రామాల వారీగా పర్యటించాలని సూచించారు. ఉపాధి హామీ కూలీల సమీకరణ గ్రామపంచాయతీ కార్యదర్శుల బాధ్యత అని, ఈ విషయంలో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. నర్సరీలలో 100 శాతం బ్యాగ్ ఫిల్లింగ్, విత్తనాల నాటకం పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
పనుల అమలులో నిర్లక్ష్యం సహించబోము
ఉపాధి హామీ పథకం కింద మంజూరైన పనులను వెంటనే ప్రారంభించి, పూర్తయిన పనులను ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి, పంచాయతీ అధికారులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.


