epaper
Monday, March 2, 2026
epaper

విదేశీ ఉద్యోగాల పేరిట యువత అక్రమ రవాణా

విదేశీ ఉద్యోగాల పేరిట యువత అక్రమ రవాణా
లావోస్ సైబర్ మోసాల గ్యాంగ్ బండారం బట్టబయలు
ఉద్యోగాల ముసుగులో లక్షల వసూళ్లు.. అంతర్జాతీయ ముఠా అరాచకం
హైద‌రాబాద్ విమానాశ్రయంలో ప్రధాన నిందితుడు అరెస్ట్
థాయ్‌లాండ్ నుంచి లావోస్‌కు అక్రమ తరలింపు.. పాస్‌పోర్టులు స్వాధీనం
యువతతో సైబర్ మోసాలు చేయించిన గ్యాంగ్‌పై కేసు నమోదు

కాకతీయ, కరీంనగర్ బ్యూరో : విదేశాల్లో అధిక వేతనాలతో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి యువతను థాయ్‌లాండ్, లావోస్ దేశాలకు అక్రమంగా తరలించి సైబర్ మోసాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ ముఠా వ్యవహారం జగిత్యాల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టి ఈ ముఠా బండారాన్ని బయటపెట్టారు. కేసులో ప్రధాన నిందితుడు ఇస్లావత్ విజయేందర్ అలియాస్ ఆండ్రూ (38)ను ఫిబ్రవరి 17న హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు.

బ్యాంకాక్ నుంచి లావోస్‌కు అక్రమ తరలింపు

పోలీసుల వివరాల ప్రకారం నిందితుడు తన సహచరులతో కలిసి జగిత్యాల, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువతను విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి వారి వద్ద నుంచి భారీగా డబ్బులు వసూలు చేశాడు. బాధితులను ముందుగా థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌కు పంపించి అక్కడి నుంచి అక్రమంగా లావోస్‌కు తరలించినట్లు వెల్లడైంది. అక్కడికి చేరుకున్న తర్వాత వారి పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకుని చైనా ముఠాతో కలిసి సోషల్ మీడియా ద్వారా విదేశాల్లో ఉన్న భారతీయులను లక్ష్యంగా చేసుకుని సైబర్ మోసాలు చేయించేవారని పోలీసులు తెలిపారు. అమెరికా మహిళల పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టించి క్రిప్టోకరెన్సీ, ఆన్‌లైన్ పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడేలా బాధితులను బలవంతం చేసినట్లు గుర్తించారు.

ఒక్కో వ్యక్తిపై రూ.1.75 లక్షల కమిషన్

ఈ అక్రమ రవాణా ద్వారా ఒక్కో వ్యక్తిపై సుమారు రూ.1.75 లక్షల వరకు కమిషన్ పొందినట్లు విచారణలో తేలింది. ఈ ముఠాలో మీసాల రాజశేఖర్, దండుగుల కళ్యాణ్, శ్యాంరావు రాజశేఖర్‌తో పాటు లావోస్‌లో ఉన్న రాజు (వైజాగ్) కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు వెల్లడించారు. బ్యాంకాక్‌లో కాల్ సెంటర్ ఉద్యోగాల పేరుతో పలువురిని విదేశాలకు పంపించి మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. కొంతమంది బాధితులు మోసపోయిన విషయం తెలుసుకుని భారత్‌కు తిరిగి రాగా, మరికొందరు ఇప్పటికీ విదేశాల్లోనే ఉన్నట్లు సమాచారం.

విదేశీ ఉద్యోగాల మోసాలపై పోలీసుల హెచ్చరిక

విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే అనుమానాస్పద ఏజెంట్లను నమ్మవద్దని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ యువతకు సూచించారు. విదేశీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక వెబ్‌సైట్లు, సంస్థల గుర్తింపు వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలని తెలిపారు. మోసాలకు గురైన వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్ లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు. ఈ కేసు వివరాలను వెల్లడించిన మీడియా సమావేశంలో సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకటరమణ, రూరల్ ఇన్స్పెక్టర్ సుధాకర్, ఎస్‌ఐలు ఉమాసాగర్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img