epaper
Monday, March 2, 2026
epaper

ఎందుకు ఓడాం ?

ఎందుకు ఓడాం ?

అధికార పార్టీలో అంతర్మథనం

మున్సిపల్ ఫలితాలపై కాంగ్రెస్ ఆత్మ పరిశీలన

ఎన్నిక‌ల్లో ఓట‌మిపై కేడ‌ర్ నారాజ్‌

కాకతీయ, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్లలో మున్సిపల్ ఎన్నికలు అధికార పార్టీకి నిరాశ‌ను మిగిల్చాయి. బీఆర్ఎస్ విజ‌యంసాధించ‌డంతో ఫలితాల‌పై కాంగ్రెస్ పార్టీలో అంతర్మథనం మొదలైంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సిరిసిల్ల పట్టణ ప్రజల సంపూర్ణ ఆదరణను పొందడంలో విఫలమయ్యామనే భావన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పట్టణ ఓటర్లను ఆకర్షించడంలో వ్యూహాత్మక లోపాలు చోటుచేసుకున్నాయనే చర్చ సాగుతోంది.

నాయకత్వ లోటు… ప్రచారంలో సమన్వయ లోపం

ఎన్నికల సమయంలో అభ్యర్థులను ముందుండి నడిపించే బలమైన స్థానిక నాయకత్వం కనిపించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వార్డు స్థాయిలో సమన్వయం లేకపోవడం, ప్రచార కార్యక్రమాల్లో స్పష్టమైన దిశా నిర్దేశం లేకపోవడం ప్రభావం చూపిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నాయి. ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రుల సభలు కూడా ఆశించినస్థాయిలో ప్రజలను ఆకర్షించలేకపోయాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజల్లో ఉత్సాహం రేకెత్తించే ప్రసంగాలు, స్థానిక సమస్యలపై స్పష్టమైన హామీలు ఇవ్వడంలో లోటు కనిపించిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అభ్యర్థుల ఎంపికలో లోపాలపై చర్చ

స్థానిక సమీకరణాలు, వ్యక్తిగత ఇమేజ్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా కౌన్సిలర్ అభ్యర్థుల ఎంపిక జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. గ్రౌండ్ స్థాయిలో బలమైన అభ్యర్థులు కాకపోవడంతో న‌ష్టం జ‌రిగింద‌ని పార్టీలో చర్చ సాగుతోంది. పార్టీకి అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో కూడా తగిన వ్యూహం లేకపోవడం వల్ల ఓట్లు బ‌ద‌లాయింపు చోటుచేసుకున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు.

సంక్షేమ పథకాల ప్రభావం ఏదీ?

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అన్ని వార్డుల్లో సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో లోటు ఉన్నట్లు భావిస్తున్నారు. అధికార పార్టీగా ఉన్న ప్రయోజనాన్ని ప్రచారంలో పూర్తిగా వినియోగించుకోలేకపోయామని కొందరు నేతలు ఒప్పుకుంటున్నారు. ప్రతి ఇంటికీ చేరే విధంగా డోర్ టు డోర్ ప్రచారం, లబ్ధిదారులతో ప్రత్యక్ష సంప్రదింపులు మరింత బలంగా నిర్వహించి ఉంటే ఫలితాలు భిన్నంగా ఉండేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బీఆర్ఎస్ వ్యతిరేకతను సద్వినియోగం చేసుకోలేకపోయారా?

గత బీఆర్ఎస్ కౌన్సిలర్లపై వచ్చిన అవినీతి ఆరోపణలు, అహంకార ధోరణి, ప్రజలతో దూరం పెరగడం వంటి అంశాలను బలంగా ఎత్తిచూపి ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం కాంగ్రెస్‌కు ఉన్నప్పటికీ, ఆ వ్యతిరేకతను సమర్థంగా ఓట్లుగా మలచుకోలేకపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఏకీకృత ఓటుగా మార్చే వ్యూహం లోపించిందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

అంతర్గత సమీక్షకు సన్నాహాలు

ఫలితాల అనంతరం పార్టీలో సమీక్ష సమావేశాలు నిర్వహించి లోపాలను గుర్తించి సరిదిద్దుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. బూత్ స్థాయి వ్యవస్థను పునర్వ్యవస్థీకరించడం, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం, స్థానిక సమస్యలపై నిరంతర పోరాటం చేయడంవంటి అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నేతలు అభిప్రాయపడుతున్నారు.

ముందున్న రాజకీయ సవాళ్లు

మున్ముందు పట్టణ అభివృద్ధి కార్యక్రమాల్లో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.ప్రజలతో నిరంతర సంబంధం, బాధ్యతాయుత పాలన, స్పష్టమైన కమ్యూనికేషన్ లేకపోతే పట్టణ రాజకీయాల్లో స్థిరపడడం కష్టమనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.మొత్తంగా, అధికారంలో ఉన్నప్పటికీ సిరిసిల్ల పట్టణ ప్రజల మద్దతును సాధించడంలో ఎదురైన సవాళ్లపై కాంగ్రెస్‌లో జరుగుతున్న అంతర్మథనం భవిష్యత్ రాజకీయ దిశను నిర్ణయించనుంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img