ములుగును చేజిక్కించుకున్న కాంగ్రెస్
20 వార్డుల్లో 12 చోట్ల విజయం
చైర్మన్ పీఠంపై అంతర్గత పోటీ
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మొత్తం 20 వార్డులకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మూడు రౌండ్లుగా నిర్వహించి పూర్తిచేశారు. ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 12 వార్డుల్లో విజయం సాధించి మున్సిపాలిటీలో మెజార్టీని దక్కించుకుంది. బీఆర్ఎస్ పార్టీ 5 వార్డుల్లో గెలుపొందగా, బీజేపీ ఒక వార్డు, స్వతంత్ర అభ్యర్థులు రెండు వార్డుల్లో విజయం సాధించారు. ఈ ఫలితాలతో ములుగు మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిపత్యం సాధించినట్లు స్పష్టమైంది. దీంతో చైర్మన్ పదవి కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లడం ఖాయమైంది.
వార్డు వారీగా ఫలితాలు
1వ వార్డు – ఆలోతు పద్మ (కాంగ్రెస్)
2వ వార్డు – కోయిల లక్ష్మి (బీఆర్ఎస్)
3వ వార్డు – యాసం వసంత (కాంగ్రెస్)
4వ వార్డు – గుంటోజు పావని (కాంగ్రెస్)
5వ వార్డు – గుగ్గిళ్ళ దివ్య (కాంగ్రెస్)
6వ వార్డు – చింతనిప్పుల చంద్రకళ (కాంగ్రెస్)
7వ వార్డు – బైకాని సునీత (బీఆర్ఎస్)
8వ వార్డు – నల్లెల స్వాతి (కాంగ్రెస్)
9వ వార్డు – గండ్రకోట వాణి (స్వతంత్ర)
10వ వార్డు – గజ్జల సుస్మిత (కాంగ్రెస్)
11వ వార్డు – కె. శెట్టి నవీన్ కుమార్ (కాంగ్రెస్)
12వ వార్డు – పోరీక రాజు నాయక్ (స్వతంత్ర)
13వ వార్డు – చిలువేరు సాంబయ్య (కాంగ్రెస్)
14వ వార్డు – ఆసియా సాజిద్ (కాంగ్రెస్)
15వ వార్డు – రేసోజు పద్మ (బీఆర్ఎస్)
16వ వార్డు – మహమ్మద్ కుతుబుద్దీన్ (కాంగ్రెస్)
17వ వార్డు – గోనెల భరత్ (బీఆర్ఎస్)
18వ వార్డు – బైకాని అనుష (బీఆర్ఎస్)
19వ వార్డు – పౌడాల ఓం ప్రకాష్ (కాంగ్రెస్)
20వ వార్డు – కొత్త సురేందర్ (బీజేపీ)
పార్టీ వారీగా ఫలితాలు : కాంగ్రెస్ – 12, బీఆర్ఎస్ – 5, బీజేపీ – 1, స్వతంత్రులు – 2
చైర్మన్ పీఠంపై అంతర్గత పోటీ
ములుగు మున్సిపాలిటీ చైర్మన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో కాంగ్రెస్లో అంతర్గత పోటీ ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ నుంచి గెలిచిన అభ్యర్థుల్లో ముగ్గురు చైర్మన్ రేసులో ఉన్నారు. 4వ వార్డు నుంచి గెలిచిన గుంటోజు పావని, 8వ వార్డు నుంచి విజయం సాధించిన నల్లెల స్వాతి, 6వ వార్డు నుంచి గెలిచిన చింతనిప్పుల చంద్రకళ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. చైర్మన్ ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం తుది నిర్ణయం తీసుకోనుంది. కాంగ్రెస్ విజయంతో స్థానిక నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి కట్టుబడి పని చేస్తామని విజేతలు పేర్కొన్నారు.


