కొల్లాపూర్లో కాంగ్రెస్ డబుల్ విక్టరీ
అల్లంపేట, ధర్మపురిలో బీఆర్ఎస్–కాంగ్రెస్ పోటీ
నర్సాపూర్, ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ జోరు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ మంచి ఆరంభం చేసింది. 11వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి నరసింహారావు విజయం సాధించగా, 1వ వార్డులో ఫసులా సుజాత గెలుపొందారు. దీంతో కొల్లాపూర్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
అల్లంపేట మున్సిపాలిటీలో 16వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి సురేష్ రెడ్డి విజయం సాధించగా, అదే మున్సిపాలిటీలో మరో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి స్వప్న గెలుపొందారు. ధర్మపురి మున్సిపాలిటీలో 9వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఇందారపు రామన్న విజయం సాధించారు. అల్లంపేటలోనే 10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి సునీత విజయం నమోదు చేశారు.
నర్సాపూర్ మున్సిపాలిటీలో 1వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి నరసమ్మ గెలుపొందారు. బోడకసారం మున్సిపాలిటీలో 6వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి గంగేశ్వర్నాథ్ విజయం సాధించగా, మరో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ నాయక్ గెలుపొందారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 6వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి రాజ్మోహన్ విజయం నమోదు చేశారు. సూప్రాం మున్సిపాలిటీలో 4వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి జయపాల్ నాయక్ గెలుపొందారు.
మొత్తంగా ప్రారంభ దశలో ప్రకటించిన ఫలితాలు చూస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చెరోచోట విజయాలు సాధిస్తూ పోటీ సమానంగా కొనసాగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇవి కేవలం ప్రారంభ దశ ఫలితాలు మాత్రమే కావడంతో తుది ఫలితాలపై స్పష్టత రావాలంటే మిగిలిన వార్డుల లెక్కింపు పూర్తయ్యే వరకు వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది.


