epaper
Monday, March 2, 2026
epaper

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా!

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా!
70 శాతం స్థానాలు అధికార పార్టీ ఖాతాలోకి – పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్
కరీంనగర్, నిజామాబాద్‌లో బీజేపీ బలమైన పట్టు
మూడు కార్పొరేషన్లలో ఎంఐఎం కింగ్‌మేకర్

కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో ఈ రోజు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించబోతున్నట్లు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే అంచనా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల్లో దాదాపు 70 శాతం మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశముందని సర్వే స్పష్టం చేసింది.

మంచిర్యాల, రామగుండం, నల్లగొండ, మహబూబ్‌నగర్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యంలో ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఈ ఐదు కార్పొరేషన్లలో కాంగ్రెస్‌దే పైచేయి కనిపిస్తోందని పీపుల్స్ పల్స్ వెల్లడించింది.

కరీంనగర్–నిజామాబాద్‌లో బీజేపీ జోరు
మరోవైపు కరీంనగర్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశముందని సర్వే అంచనా వేసింది. ఈ రెండు కార్పొరేషన్లను బీజేపీ కైవసం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది.

ఎంఐఎం కీలక పాత్ర
నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్ కార్పొరేషన్లలో ఎంఐఎం కింగ్‌మేకర్ పాత్ర పోషించే పరిస్థితి ఉందని పీపుల్స్ పల్స్ వెల్లడించింది. తుది ఫలితాల్లో ఈ మూడు చోట్ల ఎంఐఎం మద్దతు అత్యంత కీలకంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది.

బీఆర్ఎస్‌కు భారీ ఎదురుదెబ్బ
ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో తీవ్రంగా వెనుకబడే పరిస్థితి కనిపిస్తోంది. ఏ ఒక్క మున్సిపల్ కార్పొరేషన్‌ను కూడా గెలిచే అవకాశాలు లేవని ఎగ్జిట్ పోల్ స్పష్టం చేయడం గమనార్హం.

కార్పొరేషన్ల వారీగా అంచనాలు

రామగుండం: కాంగ్రెస్ 30–34, బీఆర్ఎస్ 16–20, బీజేపీ 3–6, ఇతరులు 4–7

మంచిర్యాల: కాంగ్రెస్ 39–43, బీఆర్ఎస్ 8–12, బీజేపీ 6–9

కొత్తగూడెం: కాంగ్రెస్ 28–34, సీపీఐ 14–16, బీఆర్ఎస్ 7–9

మహబూబ్‌నగర్: కాంగ్రెస్ 26–30, బీఆర్ఎస్ 18–22, బీజేపీ 6–8

నల్లగొండ: కాంగ్రెస్ 21–26, బీఆర్ఎస్ 8–12

నిజామాబాద్: బీజేపీ 26–31, కాంగ్రెస్ 10–16, ఎంఐఎం 8–12

కరీంనగర్: బీజేపీ 24–29, కాంగ్రెస్ 14–16, ఎంఐఎం 6–9

మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఆధిక్యం

రాష్ట్రవ్యాప్తంగా 68 నుంచి 76 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశముందని సర్వే తెలిపింది. బీఆర్ఎస్ 29–36 మున్సిపాలిటీలకు పరిమితం కానుండగా, బీజేపీ 3–5 మున్సిపాలిటీల్లో విజయం సాధించే అవకాశం ఉంది. సుమారు 8 నుంచి 14 మున్సిపాలిటీల్లో మాత్రం హోరాహోరీ పోరు కనిపిస్తోందని వెల్లడించింది.

ఓట్ల శాతం అంచనాలు

116 మున్సిపాలిటీల పరిధిలో కాంగ్రెస్‌కు 36 శాతం ఓట్లు, బీఆర్ఎస్‌కు 29.7 శాతం, బీజేపీకి 19.3 శాతం, ఎంఐఎంకు 2 శాతం ఓట్లు దక్కే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది.

వార్డు స్థాయి ఫలితాల అంచనాలు

కాంగ్రెస్: 1210–1290 వార్డులు

బీఆర్ఎస్: 860–930

బీజేపీ: 250–270

ఎంఐఎం: 35–44

సీపీఐ: 12–17

సీపీఎం: 10–14

ఇతరులు: 90–110

ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమైతే తెలంగాణ మున్సిపల్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ బూస్ట్ లభించనుండగా, బీఆర్ఎస్‌కు మాత్రం గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. అధికారిక ఫలితాలు వెలువడే వరకు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img