epaper
Monday, March 2, 2026
epaper

సైలెన్స్ ప్లీజ్‌..!

సైలెన్స్ ప్లీజ్‌..!
మునిసిప‌ల్ ప్రచారానికి తెర!
చివరి రోజున హోరెత్తిన ఎన్నికల ప్రచారం
అసెంబ్లీ ఎన్నికలను తలపించిన ప్రచార పర్వం
భూపాలపల్లిలో కేటీఆర్ రోడ్ షో హైలైట్
12 మున్సిపాలిటీల్లో 11న పోలింగ్
బరిలో 1,072 మంది అభ్యర్థులు
కాంగ్రెస్–బీఆర్‌ఎస్–బీజేపీ మధ్యే ప్రధాన పోటీ
చాలా చోట్ల ద్విముఖ, కొన్ని చోట్ల త్రిముఖ పోటీ
48 గంటల సైలెన్స్ పిరియడ్ అమల్లోకి
13న తేలనున్న ప్రజా తీర్పు

కాకతీయ, వరంగల్ బ్యూరో : ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి అధికారికంగా తెరపడింది. సోమవారం సాయంత్రం 5 గంటలతో ప్రచార హోరు ముగియడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా శాంతించింది. జిల్లాలోని 12 మున్సిపాలిటీల పరిధిలో చివరి రోజు ప్రచారం అసెంబ్లీ ఎన్నికలను తలపించే రీతిలో హోరెత్తింది. ప్రధాన రాజకీయ పార్టీల నేతలు, అభ్యర్థులు సుడిగాలి పర్యటనలు, భారీ రోడ్ షోలు, ఇంటింటి ప్రచారాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు చివరి క్షణం వరకు ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా భూపాలపల్లిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన రోడ్ షో ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రచారం ముగిసిన వెంటనే ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మైకులు మూగబోయాయి. పోలింగ్ పూర్తయ్యే వరకు ఎలాంటి బహిరంగ ప్రచార కార్యక్రమాలకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. 48 గంటల సైలెన్స్ పిరియడ్ కూడా అధికారికంగా అమల్లోకి వచ్చింది.

12 మున్సిపాలిటీల్లో హోరాహోరీ పోరు

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, మరిపెడ, తొర్రూరు, భూపాలపల్లి, జనగామ, వర్ధన్నపేటతో పాటు కొత్తగా ఏర్పడిన కేసముద్రం, స్టేషన్ ఘనపూర్, ములుగు, మున్సిపాలిటీల్లో ఈసారి ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 260 వార్డులకు పోలింగ్ నిర్వహించనుండగా, పట్టణాభివృద్ధి, తాగునీటి సమస్యలు, డ్రైనేజీ, రహదారులు, ఉపాధి అవకాశాలు వంటి అంశాలు ప్రచారంలో ప్రధాన అజెండాగా నిలిచాయి. ఈ ఎన్నికల్లో జిల్లావ్యాప్తంగా 1,072 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 249 మంది, బీఆర్ఎస్ నుంచి 259 మంది, బీజేపీ నుంచి 238 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, మిగతావారు స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. చాలా వార్డుల్లో ద్విముఖ పోటీ నెలకొనగా, కొన్ని ప్రాంతాల్లో త్రిముఖ పోటీ కూడా కనిపిస్తోంది. అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉండటంతో పోలింగ్ శాతం ఎలా ఉండబోతుందన్న అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
మహబూబాబాద్, నర్సంపేట, జనగామ వంటి మున్సిపాలిటీల్లో రెబల్ అభ్యర్థుల బెడద ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారింది. ఈ రెబల్స్ ఓట్ల చీలికకు కారణమై ఫలితాలను తారుమారు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రచారంలో ప్రధాన పార్టీలన్నీ బీసీ ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకుని వ్యూహాలు రచించాయి. 43 శాతం రిజర్వేషన్ల డిమాండ్ నేపథ్యంలో బీసీ వర్గాలను ఆకట్టుకునేందుకు ప్రత్యేక హామీలు ఇచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇళ్లు, సంక్షేమ పథకాల అమలును ప్రధానంగా ప్రస్తావించగా, బీఆర్ఎస్ గత పదేళ్లలో జరిగిన అభివృద్ధిని ఎత్తిచూపింది. ప్రభుత్వం మున్సిపల్ అభివృద్ధికి ఉమ్మడి జిల్లాలో రూ.6,116 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రచారంలో ప్రకటించింది.

పోలింగ్‌కు సిద్ధమైన యంత్రాంగం

ఫిబ్రవరి 11, 2026న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుండగా, ఫలితాలు ఫిబ్రవరి 13న వెల్లడించనున్నారు. ప్రచారం ముగియడంతో ఎన్నికల యంత్రాంగం పూర్తిగా పోలింగ్ ఏర్పాట్లపై దృష్టి సారించింది. పోలింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు నిరంతర గస్తీ నిర్వహిస్తున్నాయి. నగదు పంపిణీ, మద్యం, బహుమతుల పంపకం వంటి ప్రలోభాలకు తావులేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. హోరెత్తిన ప్రచార పర్వం ముగియడంతో ఇప్పుడు ఓటర్ల నిర్ణయమే అత్యంత కీలకంగా మారింది. పట్టణాల అభివృద్ధిపై ప్రజలు ఎవరికి పట్టం కడతారన్నది ఫిబ్రవరి 11న జరిగే పోలింగ్ ద్వారా స్పష్టమవనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ మున్సిపల్ ఎన్నికలు రాజకీయంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఫలితాలు అధికార పార్టీల భవిష్యత్ వ్యూహాలకు దిశానిర్దేశం చేయనున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి ఫిబ్రవరి 13న వెలువడే ప్రజా తీర్పుపైనే కేంద్రీకృతమైంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img