“మోసపూరిత హామీలతో మోసం చేస్తారు”
-మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
కాకతీయ, రామకృష్ణాపూర్ : కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత హామీలతో ఈ ప్రాంత ప్రజలను మరోసారి మోసం చేస్తారని,ప్రజలు కాంగ్రెస్ వాళ్ళు చెప్పే మాటలు నమ్మవద్దని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బాల్క సుమన్ తెలిపారు. సోమవారం క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డుల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అవ్వకు,అక్కలకు,ఒంటరి మహిళల తల్లులకు పెంచిన పెన్షన్ ఇప్పటికీ అమలు చేయలేదని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు వచ్చే పెన్షన్ అడగాలని గుర్తు చేశారు. బీఆర్ఎస్,సీపీఐ పొత్తులో భాగంగా ప్రకటించిన తమ అభ్యర్థులకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ అభ్యర్థులకారు గుర్తు,సీపీఐ అభ్యర్థుల కంకి కొడవలి గుర్తుపై ఓటు వేయాలని సూచించారు.


