కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యండి
అభివృద్ధికి సహకరించండి
వ్యాపారస్థులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పిట్ట బెదిరింపులకు భయపడేదిలేదు
మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు
కాకతీయ, జమ్మికుంట : కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు అండగా ఉంటూ ముందుకు వెళ్తున్నామని ఇప్పుడు నేతన్నలకు కూడా అండగా ఉంటామని రాష్ట్ర ఐటీ శాఖ,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు.సోమవారం రోజున జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్,జమ్మికుంట మున్సిపల్ ఎన్నికల ఇంచార్జి సిఎన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటి నుండి ఈ ప్రాంతంతో మంచి సంబంధాలు ఉన్నాయని,గతంలో అనేక సమస్యల మీద ఇదే గాంధీ చౌరస్తాలో ధర్నాలు నిర్వహించామని,అందులో కొన్ని ఇప్పుడు సంక్షేమ పథకాలుగా పురుడుపోసుకొని ప్రజలకు అందిస్తున్నామని,పదేళ్ల పాటు అరాచక దోపిడీ పాలనను బీఆర్ఎస్ నాయకులు కొనసాగించారని,దానికి విరుద్ధంగా సంక్షేమ పాలనను రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నామని అన్నారు.హుజూరాబాద్ ప్రాంతం మరో రాయలసీమ కావొద్దని,సెంటిమెంట్ తో మరోసారి మోసపోవద్దని ప్రజలను కోరారు.ఎమ్మేల్యేగా గెలిచిన కౌశిక్ రెడ్డి టీవీలు,ఫోన్ లో తప్ప ప్రజలకు అందుబాటులో ఉండడని అతని వల్ల ఏం ఉపయోగంలేదని ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రణవ్ నాయకత్వంలో ఈ ప్రాంతానికి అధిక నిధులు కేటాయిస్తామని,ఆ బాధ్యత తాను తీసుకుంటానని,హుజురాబాద్ లో బెదిరింపు రాజకీయాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.వ్యాపారస్థులకు,నేతన్నలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు పత్తి కృష్ణారెడ్డి,ఆరుకాల వీరేశలింగం,సాయిని రవి,సారంగపాణి,పొనగంటి మల్లయ్య,పట్టణ,మండల అధ్యక్షులు,మహిళా అధ్యక్షురాల్లు,30 వార్డులనుండి పోటీ చేసే అభ్యర్థులు,సీనియర్ నాయకులు,మైనారిటీ నాయకులు,యూత్ కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు


