epaper
Monday, March 2, 2026
epaper

రేవంత్‌ రెడ్డినే తగులబెట్టించాడు

రేవంత్‌ రెడ్డినే తగులబెట్టించాడు
ప‌థ‌కం ప్ర‌కారం ఆధారాలు లేపేసిండు
ఓటుకు నోటు కేసు నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ప్లాన్‌
ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ అగ్ని ప్రమాదం వెనుక కుట్ర
బుడ్డ బిల్డింగ్‌లో మంటలు ఆర్పడానికి మూడు గంటలా?
సాక్ష్యాలన్నీ మాయం చేయడానికి పోలీసులు సహకారం
బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ అగ్ని ప్రమాదం వెనుక కుట్ర ఉందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అనుమానం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డినే ల్యాబ్‌ను తగులబెట్టించాడని ప్రజలంతా భావిస్తున్నారని తెలిపారు. ఆధారాలు నాశనం చేసి కేసు నుంచి బయటపడాలని రేవంత్‌ రెడ్డి స్వయంగా కుట్ర పన్ని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో ఆధారాలు లేపేసిండని విమర్శించారు. హనుమకొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. మేమంతా మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో ఉండగా రేవంత్‌ రెడ్డి ఈ కుట్ర చేశారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసు జగద్విదితమని కేటీఆర్‌ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి 2015లో ఎమ్మెల్యేలను కొనడానికి వచ్చి రూ.50లక్షల బ్యాగుతో కెమెరాల ముందు దొరికాడని గుర్తుచేశారు. ఈ కేసు నుంచి బయటపడటానికే రేవంత్‌ రెడ్డి కుట్ర చేశాడని అన్నారు. ఓటుకు నోటు కేసు విచారణ న్యాయస్థానంలో తుది దశకు వచ్చిందని తెలిపారు. చివరి దశలో ఆధారాలు మాయం చేయడానికి పన్నిన కుట్ర అని అనుమానం వ్యక్తం చేశారు.

చలికాలంలో అగ్ని ప్రమాదాలు జరుగుతాయా?

దొంగతనం చేసి దొరికిపోవడం రేవంత్‌ రెడ్డికి అలవాటే అని కేటీఆర్‌ విమర్శించారు. అగ్ని ప్రమాదాలు ఎప్పుడు జరుగుతాయి? చలికాలంలో ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరుగుతాయా అని ఆయన నిలదీశారు. చలికాలం పొద్దున 10 గంటలకు అగ్ని ప్రమాదం జరిగిందట.. రేవంత్‌ రెడ్డి చెప్పే మాటలు మనం నమ్మాలా అని ప్రశ్నించారు. ఇది చేయించబడిన అగ్ని ప్రమాదం అని అన్నారు. తన క్రిమినల్‌ మనస్తత్వంతో రేవంత్‌ రెడ్డినే ల్యాబ్‌ను తగులబెట్టించాడని తెలిపారు.

బుడ్డ బిల్డింగ్‌లో మంటలు ఆర్పడానికి మూడు గంటలు పట్టిందా ?

నేరాల విచారణలో ఫోరెన్సిక్‌ కీలక విభాగమని కేటీఆర్‌ తెలిపారు. వేలాది కేసుల వివరాలు అగ్గికి బుగ్గి అయ్యాయని పేర్కొన్నారు. ఎంతోమంది క్రిమినల్స్‌ తప్పించుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. టీజీఎఫ్‌ఎస్‌ఎల్‌ ప్రకటన తూతూ మంత్రంగా ఉందని తెలిపారు. ఏం నష్టం జరగలేదంటూ డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక ఇన్‌స్పెక్టర్‌ నిజాయితీగా పనిచేశాడని చెప్పారు. ఉదయం 10 గంటలకు అగ్ని ప్రమాదం జరిగినట్లు ఎఫ్‌ఐఆర్‌లో స్పష్టంగా రాశారని తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల దాకా మంటలు అదుపు చేయలేదని.. బుడ్డ బిల్డింగ్‌లో మంటలు ఆర్పడానికి మూడు గంటలు పట్టిందా అని ప్రశ్నించారు. సాక్ష్యాలన్నీ మాయం చేయడానికి పోలీసులు సహకరించారని అన్నారు. మూడు అంతస్తుల భవనంలో మంటలు ఆర్పడానికి మూడు గంటలు పడుతుందంటే నమ్మాలా అని ప్రశ్నించారు. మొదటి అంతస్తులో మంటలు ఆర్పడానికే మూడు గంటలా అని కేటీఆర్ నిలదీశారు.

మీడియాను మేనేజ్‌ చేసి తిమ్మిని బమ్మి చేశారు

ముఖ్యమైన కేసుల సమాచారం అంతా మొదటి అంతస్తులోనే ఉందని తెలిపారు. ఉదయం 10 గంటలకు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో ఎవరూ డ్యూటీలో లేరట.. మీడియాను మేనేజ్‌ చేసి తిమ్మిని బమ్మి చేశారని మండిపడ్డారు. ఏం తప్పు జరగలేదని అని ఒక ఇన్‌స్పెక్టర్‌ చెప్పారని తెలిపారు. సర్వర్‌ రూమ్‌ కూడా కాలిపోయిందని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారని చెప్పారు. సర్వర్‌లు కాలబెట్టినంక ఇంకేం ఉంటుందని కేటీఆర్‌ ప్రశ్నించారు. కుట్ర విజయవంతంగా పూర్తిచేశారని అన్నారు. 50 కంప్యూటర్లు తగలబడ్డాయని చెబుతున్నారని తెలిపారు. ఒక ప్రభుత్వం తమ ప్రభుత్వ కార్యాలయాన్ని తామే కాల్చిపారేయడం దేశంలో ఎక్కడా జరగదని విమర్శించారు.

మేం సైంటిస్టులను తీసుకొని వస్తం.. మమ్మల్ని రానివ్వండి

దొంగ, చీకటి ఏకమయ్యాయని కేటీఆర్‌ విమర్శించారు. ముఖ్యమంత్రే దొంగ అని అన్నారు. కేంద్రంతో రేవంత్‌ రెడ్డి ఇన్ని రోజులు మేనేజ్‌ చేసుకున్నాడని తెలిపారు. అమిత్‌ షా కాళ్లు పట్టుకుని అడుక్కున్నాడని పేర్కొన్నారు. చివరకు సాక్ష్యాధారాలను మాయం చేసే డెడ్లీ కుట్ర చేసిండని అన్నారు. ఇందులో కుట్రను కేంద్రం నిగ్గుతేల్చాలని కోరారు. రిటైర్డ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఇది కుట్రపూరితంగా జరిగిందే.. ప్రమాదం కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని వేల కేసుల ఆధారాలు బుగ్గి చేశారని కేటీఆర్‌ మండిపడ్డారు. నేరగాళ్లు, రేపిస్టులు, దుర్మార్గులకు శిక్ష పడే అవకాశం లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. మేం సైంటిస్టులను తీసుకొని వస్తం.. మమ్మల్ని రానివ్వండి అని కోరారు. సీఎం రేవంత్‌ రెడ్డితో లాలూచీ లేకపోతే.. కేంద్రం ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ వచ్చి ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారని అంటాడని.. బడే భాయ్‌, ఛోటే భాయ్‌ బంధం లేకపోతే వెంటనే విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. సింగరేణి కుంభకోణాన్ని మేం బయటపెట్టినం.. సీఎం బామ్మర్ది పాత్ర ఉందని బయటపెట్టినం.. కానీ కేంద్రం విచారణ జరపడం లేదని తెలిపారు. దారుణ నేరానికి ఒడిగట్టిన నేరగాడిని బయటపెట్టాలని ఆయ‌న డిమాండ్‌ చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img