ప్రిసీడింగ్ అధికారులకు శిక్షణ
కాకతీయ, జమ్మికుంట : రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జమ్మికుంట ప్రిసైడింగ్ అధికారులకు, అసిస్టెంట్ ప్రిసీడింగ్ అధికారులకు రెండోవ సాధారణ ఎన్నికలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శనివారం జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ఎన్నికలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్, జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు జితేందర్ రెడ్డి, జిల్లా వ్యయ పరిశీలకులు మనోహర్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల నిబంధనల మేరకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, మున్సిపల్ వారు మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని, ఈ 2వ సాధారణ ఎన్నికలు సజావుగా పూర్తి చేయాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ జి రాజిరెడి, టిపివో శ్రీధర్, టిపిఎస్ రాజ్ కుమార్, రఫీ లతో పాటుపలువురు పాల్గొన్నారు.


