epaper
Monday, March 2, 2026
epaper

‘చెప్పుల దొంగ’కు ఎందుకు ఓట్లేయాలి?

‘చెప్పుల దొంగ’కు ఎందుకు ఓట్లేయాలి?
బజార్ల అప్పు కూడా పుట్టని సీఎంను నమ్ముకుంటే లాభమేమిటి?
బీఆర్‌ఎస్ పాలనలో కబ్జాలు, దోపిడీలే మిగిలాయి
కేంద్రం నిధులతోనే కరీంనగర్ అభివృద్ధి
బీజేపీకి మేయర్ పీఠం అప్పగిస్తే వరదలా నిధులు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

కాకతీయ, కరీంనగర్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయారని, అటువంటి వ్యక్తికి మున్సిపల్ ఎన్నికల్లో ఎందుకు ఓటేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఘాటుగా ప్రశ్నించారు. “బజార్ల అప్పు కూడా పుట్టని వ్యక్తి నగరాలను ఎలా అభివృద్ధి చేస్తారు? చెప్పుల దొంగలాంటి వ్యక్తిని ప్రజలు ఎందుకు నమ్మాలి?” అంటూ మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కరీంనగర్‌లోని దుర్షేడ్, గోపాల్‌పూర్, సప్తగిరి కాలనీ, ఉస్మానీ అసోసియేట్స్ ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థుల తరఫున బండి సంజయ్ విస్తృత ప్రచారం నిర్వహించారు. 4, 5, 44, 45, 13వ డివిజన్ల బీజేపీ అభ్యర్థులు భూపతి రవీందర్, చిందెం హారిక, బండి తార, గడప విజయలక్ష్మి, రెడ్డవేణ లావణ్యలను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వీధి సభల్లో ఆయన మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా తనపై నమ్మకం లేదని ఒప్పుకున్నారని ఎద్దేవా చేశారు. “నాకు బజార్ల అప్పు కూడా పుట్టడం లేదు, ఢిల్లీలో చెప్పులెత్తుకుపోయే దొంగలా చూస్తున్నారు అని రేవంత్ రెడ్డే అన్నారు. మరి అలాంటి వ్యక్తిని ప్రజలు ఎందుకు నమ్మాలి?” అని ప్రశ్నించారు.

బీఆర్‌ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు..!

బీఆర్‌ఎస్ పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని, పదేళ్లుగా కబ్జాలు, దోపిడీలే జరిగాయని బండి సంజయ్ మండిపడ్డారు. “మళ్లీ ఆ పార్టీలను గెలిపిస్తే కేంద్రం ఇచ్చే నిధులను దారి మళ్లించి దోచుకోకుండా ఉంటారా? అభివృద్ధి పూర్తిగా కుంటుపడదా?” అని ప్రజలను ఆలోచించాలని కోరారు. కాంగ్రెస్ నేతలు ఓట్ల కోసం వస్తే ఆరు గ్యారంటీల అమలుపై ప్రజలు నిలదీయాలని, బీఆర్‌ఎస్ నాయకులు వస్తే గత పదేళ్ల పాలనపై ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. కరీంనగర్‌లో జరిగిన అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే జరిగిందని బండి సంజయ్ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నగరానికి రూ.1,500 కోట్లకు పైగా నిధులు మంజూరు చేశారని తెలిపారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ మోదీని గుర్తుపడతారా? వాళ్లు అడిగితే మోదీ నిధులు ఇస్తారా? అంటూ ఎద్దేవా చేశారు. “కేంద్రం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేసింది బీజేపీయే” అని స్పష్టం చేశారు. కరీంనగర్ కార్పొరేషన్‌కు ఇటీవలే కేంద్రం రూ.50 కోట్లు మంజూరు చేసిందని, ఇంటింటికీ తాగునీరు అందించేందుకు రూ.134 కోట్ల నిధులు తీసుకొచ్చినట్లు వివరించారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఇంటి పన్నులు, నల్లా ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు పెంచడం ఖాయమని హెచ్చరించారు. బీజేపీకి ఓటేస్తే మాత్రం ఎలాంటి పన్నులు పెంచకుండా కేంద్ర నిధులతోనే నగరాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. పొరపాటున కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే కేంద్ర నిధులు దారి మళ్లి అభివృద్ధి నిలిచిపోతుందని హెచ్చరించారు. బీజేపీకి మేయర్ పీఠం అప్పగిస్తే కరీంనగర్‌కు వరదలా నిధులు తీసుకొచ్చే బాధ్యత తానే తీసుకుంటానని బండి సంజయ్ ప్రజలకు హామీ ఇచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img