epaper
Sunday, March 1, 2026
epaper

వివాదాస్పద స్థలాలకు ఇంటి అనుమతులు

వివాదాస్పద స్థలాలకు ఇంటి అనుమతులు
కార్య‌ద‌ర్శి తెల‌వ‌కుండా కారోబార్ సంత‌కాలు
పంచాయ‌తీ స్టాంప్ వేసి అనుమ‌తులు జారీ
ఏలుకుర్తి హవేలీ జీపీలో అక్ర‌మాల వ్య‌వ‌హారం
ఇద్ద‌రు అన్న‌ద‌మ్ముల మ‌ధ్య పంచాయితీతో వెలుగులోకి అస‌లు నిజం
త‌న‌కు తెలియకనే జ‌రిగిందంటున్న పంచాయతీ కార్యదర్శి
తనకు సంబంధం లేదంటున్న కారోబార్
కాక‌తీయ‌కు చిక్కిన ఆధారాలు..!

కాకతీయ, గీసుగొండ : వివాదంలో ఉన్న స్థలాలకు గ్రామ పంచాయతీ కార్యదర్శి, కారోబార్ కలిసి ఇంటి అనుమతి ధ్రువీకరణ పత్రాలు జారీ చేసిన ఘటన గీసుగొండ మండలంలో కలకలం రేపుతోంది. ఒకే స్థలానికి వేర్వేరు వ్యక్తులకు అనుమతులు ఇవ్వడం, అనంతరం రిజిస్ట్రేషన్లు జరగడం, చివరికి విషయం కోర్టు మెట్లు ఎక్కడంతో అసలు వ్యవహారం బయటపడింది. గీసుగొండ మండలం ఏలుకుర్తి హవేలీ గ్రామానికి చెందిన అన్నదమ్ముల మధ్య ఇంటి దారి విషయంలో చాలాకాలంగా వివాదం కొనసాగుతోంది. గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీలు నిర్వహించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి వివాదంలో ఉన్న స్థలానికి ఒక వ్యక్తికి ధ్రువీకరణ పత్రం జారీ చేయడంతో, అతడు దారితో సహా ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఈ విషయం తెలిసిన తమ్ముడు కూడా అదే గ్రామ పంచాయతీ కార్యదర్శి నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకుని, తన ఇంటి నంబరుతో ఉన్న స్థలానికి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం మరింత వివాదానికి దారితీసింది. ఒకే స్థలానికి రెండు వేర్వేరు అనుమతులు ఎలా జారీ అయ్యాయన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

కోర్టు మెట్లు ఎక్కిన వివాదం
ఇంటి ధ్రువీకరణ పత్రాల ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న అన్నదమ్ములు పరస్పరం కోర్టును ఆశ్రయించి నోటీసులు పంపించుకున్నారు. దీంతో వివాదంలో ఉన్న స్థలానికి అనుమతులు ఎలా మంజూరయ్యాయన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. తన అన్నకు వివాదాస్పద స్థలానికి ధ్రువీకరణ పత్రం ఎలా ఇచ్చారని తమ్ముడు గ్రామ పంచాయతీ కార్యదర్శికి నోటీసులు పంపినట్లు సమాచారం. ఈ వ్యవహారం గ్రామస్థాయిలోనే కాకుండా మండల వ్యాప్తంగా చర్చకు దారితీసింది. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చారా, లేక ఉద్దేశపూర్వకంగా జరిగిందా అనే అంశాలపై విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

తెలియక ఇచ్చానంటున్న కార్యదర్శి
ఈ వ్యవహారంపై ఎలుకుర్తి హవేలీ పంచాయతీ కార్యదర్శి కోడెపాక నరేష్ స్పందిస్తూ, ఇంటి ధ్రువీకరణ పత్రం కోసం గ్రామస్తుడు తన వద్దకు వచ్చాడని తెలిపారు. కారోబార్ శంకర్‌ను అడిగితే అన్ని వివరాలు సవ్యంగానే ఉన్నాయని చెప్పడంతోనే ధ్రువీకరణ పత్రం జారీ చేశానని వివరణ ఇచ్చారు. వివాదంలో ఉందని తనకు తెలియదని ఆయన పేర్కొన్నారు. ఇదే వివాదంలో మరో వ్యక్తికి తన సంతకాలను ఫోర్జరీ చేసి, దొంగ స్టాంపులతో తప్పుడు ధ్రువీకరణ పత్రం జారీ చేశారని ఆరోపించారు. ఈ విషయంపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు కార్యదర్శి తెలిపారు.

తనకు సంబంధం లేదంటున్న కారోబార్
వివాదంలో ఉన్న స్థలానికి జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎలుకుర్తి హవేలీ కారోబార్ ఓ.శంకర్ స్పష్టం చేశారు. ఆ పత్రాలు పూర్తిగా గ్రామ పంచాయతీ కార్యదర్శి నరేష్ మంజూరు చేసినవేనని, ఈ వ్యవహారంలో తన జోక్యం ఏమీ లేదని ఆయన తెలిపారు. ఒకే స్థలానికి రెండు వేర్వేరు అనుమతులు జారీ కావడం, రిజిస్ట్రేషన్లు జరగడం వెనుక అసలు కారణాలపై ఉన్నతాధికారులు విచారణ జరిపించాలని స్థానికులు కోరుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

ఓబీసీ సాధనమే మా లక్ష్యం..!

ఓబీసీ సాధనమే మా లక్ష్యం..! ఆరె కులస్తులు అన్ని రంగాల్లో రాణించాలి చట్టసభల్లో ప్రాతినిధ్యం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img