epaper
Sunday, March 1, 2026
epaper

స్వప్న హత్యకు పోలీసుల నిర్లక్ష్యమే కారణం!

స్వప్న హత్యకు పోలీసుల నిర్లక్ష్యమే కారణం!
ఫిర్యాదులిచ్చినా పట్టించుకోని పోలీసులు
హైదరాబాద్ చుట్టుపక్కల పెరిగిన మహిళా నేరాలు
అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే అమలు చేయాలి
ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరిపి శిక్ష విధించాలి
జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
బాధిత కుటుంబ స‌భ్యుల‌కు ప‌రామ‌ర్శ‌

కాకతీయ, మొయినాబాద్ : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామంలో హత్యకు గురైన న్యాయవాది స్వప్న కుటుంబ సభ్యులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. స్వప్న ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. లాయర్‌గా పనిచేస్తున్న స్వప్న త్వరలోనే పెళ్లి చేసుకోవాలని భావించిందని, కానీ కుటుంబ సభ్యుల చేతిలోనే హత్యకు గురికావడం అత్యంత బాధాకరమని కవిత అన్నారు. ఇంత దారుణ ఘటన జరగడం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ప్రశ్నలు లేవనెత్తుతోందని వ్యాఖ్యానించారు. స్వప్న తనకు జరుగుతున్న వేధింపులపై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని కవిత ఆరోపించారు. ఫిర్యాదులు ఇచ్చినప్పుడే పోలీసులు సకాలంలో స్పందించి చర్యలు తీసుకుని ఉంటే ఇంత ఘోరం జరిగేదే కాదని ప్రజలంతా భావిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదో పోలీసులు ప్రజలకు స్పష్టత ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.

పోలీసులంటే భయం లేకుండా పోయింది
హైదరాబాద్‌కు కూతవేటు దూరంలోనే ఇలాంటి దారుణ ఘటన జరగడం అత్యంత ఆందోళనకరమని కవిత అన్నారు. అంటే నేరస్థులకు పోలీసులంటే భయం లేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మహిళలపై నేరాలు తీవ్రమవుతున్నాయని, గన్‌తో బెదిరించి డబ్బులు దోచుకునే స్థాయికి పరిస్థితులు దిగజారాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం శాంతిభద్రతల అంశంపై సీరియస్‌గా దృష్టి పెట్టాలని, పోలీసులకు కఠిన ఆదేశాలు ఇవ్వాలని ఆమె కోరారు. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోందని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లును పాస్ చేయాలి
హత్యకు గురైన స్వప్న ఒక న్యాయవాది అని గుర్తుచేస్తూ, లాయర్ల రక్షణ కోసం గతంలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్‌కు సవరణలు చేసినప్పటికీ రెండేళ్లుగా ఆ బిల్లు పెండింగ్‌లో పెట్టారని కవిత విమర్శించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆ బిల్లును తక్షణమే ఆమోదించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా స్పందించాలని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరిపించి మూడు నెలలలోపు నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నలుగురు నిందితుల్లో ఒకరిపై గతంలోనే హత్యాయత్నం కేసు ఉన్నప్పటికీ కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి దారుణం జరిగిందని పేర్కొన్నారు. నిందితులకు త్వరితగతిన శిక్షపడకపోతే నేరస్థులకు భయం ఉండదని హెచ్చరించారు. స్వప్న కుటుంబంలో ఇద్దరు వృద్ధులు ఉన్నారని, ఆ కుటుంబానికి తాము అండగా ఉంటామని కల్వకుంట్ల కవిత భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా సహాయం చేయాలని డిమాండ్ చేశారు

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఘ‌నంగా రేణుకా ఎల్లమ్మ కళ్యాణం

ఘ‌నంగా రేణుకా ఎల్లమ్మ కళ్యాణం కాకతీయ, మేడ్చల్ మల్కాజిగిరి : గౌతమ్ నగర్...

ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం కాకతీయ, మేడ్చల్ మల్కాజిగిరి: మల్కాజిగిరిలోని ప్రభుత్వ డిగ్రీ...

మద్యం దుకాణాన్ని తొల‌గించాల‌ని మహిళల ఆందోళన

మద్యం దుకాణాన్ని తొల‌గించాల‌ని మహిళల ఆందోళన ఎక్సైజ్ శాఖకు మహిళా సంఘాల ఫిర్యాదు కాకతీయ,...

బీజేపీ అండ‌తో అలియాబాద్ కాంగ్రెస్ కైవ‌సం

బీజేపీ అండ‌తో అలియాబాద్ కాంగ్రెస్ కైవ‌సం హంగ్ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు బీజేపీ మ‌ద్ద‌తు చైర్‌పర్సన్‌గా...

అత్తాపూర్‌లో లాయర్ దారుణ హత్య

అత్తాపూర్‌లో లాయర్ దారుణ హత్య కార్యాలయంలోనే కత్తులతో దాడి చేసి హత్య మొదటి భార్య...

ఏకశిలా నగర్‌లో భూదందా

ఏకశిలా నగర్‌లో భూదందా ల్యాండ్ మాఫియా–అధికారుల కుమ్మక్క‌య్యారు బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం నేను...

ప్రేమ పెళ్లి.. చివరకు వరకట్న హత్య!

ప్రేమ పెళ్లి.. చివరకు వరకట్న హత్య! అదనపు కట్నం కాటుకు యువతి బలి తాండూరులో...

*చేవెళ్ల ప్ర‌మాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య‌*

*చేవెళ్ల ప్ర‌మాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య‌* *ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌రో న‌లుగురు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img