epaper
Saturday, November 15, 2025
epaper

కాంగ్రెస్‌కు ఓటమి భ‌యం

కాంగ్రెస్‌కు ఓటమి భ‌యం..!
అందుకే స్థానిక సంస్థ‌ల‌ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో జాప్యం
వ్య‌వ‌స్థ‌ల‌న్నీ సమగ్రంగా పనిచేస్తేనే గ్రామ స్వ‌రాజ్యం
బీఆర్ఎస్ ప్రభుత్వ పాల‌న ఓ చీకటి అధ్యాయం
ప్ర‌శ్నించే వారికి సోష‌ల్ మీడియా ఓ మంచి వేదిక‌… ఆయుధం
ఆ ఆయుధాన్ని సొంత పార్టీలోనే విభ‌జ‌న‌క వాడొద్దు
మ‌ల్కాజిగిరి ఎంపీ, బీజేపీ నేత ఈట‌ల రాజేంద‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎన్నిక‌లంటేనే భ‌యం పట్టుకుంటోంద‌ని మ‌ల్కాజిగిరి ఎంపీ, బీజీపీ రాష్ట్ర నాయ‌కుడు ఈట‌ల రాజేంద‌ర్ ఎద్దేవా చేశారు. ఆ భ‌యంతోనే రెండేళ్లు కావ‌స్తున్నా.. స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం లేదని అన్నారు. మునిసిపాలిటీ, జిల్లా ప‌రిష‌త్‌, మండ‌ల ప‌రిషత్‌ల‌కు పాల‌క వ‌ర్గాలు లేక ప‌రిపాల‌న ఆగ‌మాగంగా ఉంద‌ని అన్నారు. వ్య‌వ‌స్థ‌ల‌న్నీ స‌మ‌గ్రంగా..స‌మ‌ర్థవంతంగా ప‌నిచేస్తేనే గ్రామ స్వ‌రాజ్యం సిద్ధిస్తుంద‌ని అన్నారు.
ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాల‌యంలో స్థానిక సంస్థల ఎన్నికల బీజేపీ సోషల్ మీడియా మరియు ఐటీ మరియు సోషల్ మీడియా వర్క్ షాప్‌లో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 73, 74 ప్రకారం స్థానిక సంస్థల అభివృద్ధి కొనసాగించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంద‌న్నారు. రాష్ట్రంలో మొన్నటిదాకా పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వంలోని చీకటి అధ్యాయ‌మ‌ని, ఇప్ప‌టికీ రాష్ట్ర ప్ర‌జ‌లు బీఆర్ ఎస్ చీక‌టి పాల‌న‌ను మ‌రిచిపోవ‌డం లేద‌న్నారు.

కేంద్రం నిధుల‌తోనే గ్రామాభివృద్ధి..!

“సొమ్ము ఒకరిది, సోకు ఒకరిది” అన్నట్లు, కేంద్రం ఇచ్చిన నిధులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ తమవిగా చెప్పుకుంటున్నాయ‌ని ఈట‌ల అన్నారు. గ్రామాల్లో రోడ్లు, శ్మశానవాటికలు, అంగన్‌వాడీ భవనాలు, గ్రామపంచాయతీ భవనాలు, రైతు వేదికలు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నిధులతోనే నిర్మాణమయ్యాయ‌ని తెలిపారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోంద‌న్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయ‌న్నారు. అందుకే అభివృద్ధి కొనసాగాలంటే, రానున్న ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఓటు వేయాలనీ మీరందరూ గ్రామ గ్రామాన ప్రజలను చైతన్యవంతం చేయాలని కోరుతున్నాని తెలిపారు.

సోషల్ మీడియా పాత్ర చాలా ముఖ్యమైంది..
నిజాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు సోష‌ల్ మీడియా ఒక గొప్ప ఫ్లాట్‌ఫాం అని ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. అబద్ధాలు, మోసాల మీద బతికే వారిని బట్టబయలు చేసేది కూడా సోషల్ మీడియానేనని అన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటానికి సమాచారం తెలిసి ఉండాలి.. వెంటనే స్పందించే నైపుణ్యం, క్రియేటివిటీ ఉండాలి.. తక్కువ సమయంలో, తక్కువ లైన్లలో ఎక్కువ కంటెంట్ సృష్టించగలిగే వారే యోధుల‌ని అన్నారు. సోషల్ మీడియా డబుల్ ఎడ్జ్ స్వోర్డ్ లాంటిది.. అది శత్రువుపై ప్రయోగించాలి తప్ప, మనలో మనమే విభజన చేసుకోవడానికి వాడకూడదంటూ హిత‌వు ప‌లికారు. సోషల్ మీడియా వారియర్ల చేతిలోని మొబైల్ ఫోన్, వారి మెదడు ఎఫెక్టివ్‌గా పనిచేస్తేనే ఫలితం స‌మ‌ర్థ‌వంతంగా ఉంటుంద‌న్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఉద్రిక్తత కాకతీయ, హుజురాబాద్:...

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించిన స‌ర్వే సంస్థ‌లు అన్నింట్లోనూ అధికార పార్టీకి స్పష్టమైన...

మాగంటి సునిత ఎమోష‌న‌ల్ వీడియో..!

మాగంటి సునిత ఎమోష‌న‌ల్ వీడియో..! జూబ్లీహిల్స్ ఓట‌ర్ల‌కు విజ్ఞ‌ప్తి.. కాక‌తీయ‌, హైదరాబాద్ : జూబ్లీహిల్స్...

కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది

https://twitter.com/TeluguScribe/status/1987795147560722497 కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది ఫేక్ స్లిప్పుల‌ను ఎన్నిక‌ల అధికారికి...

క‌వి అందె శ్రీ క‌న్నుమూత‌

క‌వి అందె శ్రీ క‌న్నుమూత‌ కాక‌తీయ‌, హైద‌రాబాద్ : వాగ్గేయ‌కారుడు, క‌వి అందె...

“ఓటు అమ్మకండి, పిల్లల భవిష్యత్తు ఉరితీయకండి”.

“ఓటు అమ్మకండి, పిల్లల భవిష్యత్తు ఉరితీయకండి". జూబ్లీహిల్స్‌లో స్వతంత్ర అభ్యర్థి కోట శ్యామ్‌కుమార్...

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ బూత్ బ్రదర్స్

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ బూత్ బ్రదర్స్ కాంగ్రెస్, బీజేపీది ఫెవికాల్ బంధం ముఖ్యమంత్రి...

కాంగ్రెస్‌తోనే హైద‌రాబాద్ అభివృద్ధి

కాంగ్రెస్‌తోనే హైద‌రాబాద్ అభివృద్ధి ఓఆర్‌ఆర్, ఎయిర్‌పోర్టు, మెట్రోను తీసుకొచ్చాం రాజ‌ధాని మునిగిపోతే కేంద్రం చిల్లిగవ్వ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img