వైభవంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం
కాకతీయ, రామకృష్ణాపూర్ : మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామంలో ఋష్యముఖ పర్వతం (గుట్టపై) శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని ఆదివారం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా కళ్యాణ మహోత్సవాన్ని జరిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో గుట్టపైకి తరలివచ్చారు. ముందుగా దేవతామూర్తుల విగ్రహాలను గ్రామ ప్రజలతో కలిసి ఊరేగింపుగా గుట్ట పైకి తీసుకొచ్చారు. అనంతరం వేద పండితుల సమక్షంలో కళ్యాణాన్ని జరిపించారు. కాగా గుట్టపై వెంకటేశ్వరుని నామంతో గీసిన చిత్రం వద్ద ఆడపడుచులు దిగిన ఫోటో ప్రత్యేకంగా ఆకట్టుకుంది.


