epaper
Monday, March 2, 2026
epaper

నర్సంపేటలో బీజేపీ బల ప్రదర్శన

నర్సంపేటలో బీజేపీ బల ప్రదర్శన
30 వార్డుల్లో నామినేషన్లతో రంగంలోకి కమలం
నిజాయితీగల అభ్యర్థులకే ప్రజల ఆశీర్వాదం కావాలి
మున్సిపాలిటీ అభివృద్ధే బీజేపీ లక్ష్యం
కార్యకర్తల ఐక్యతతో ఘన విజయం సాధిస్తాం
వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంట రవికుమార్

కాకతీయ, నర్సంపేట : మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ చివరి ఘట్టానికి చేరుకున్న వేళ నర్సంపేట మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ బలమైన ఉనికిని చాటింది. మొత్తం 30 వార్డుల నుంచి బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడంతో పట్టణ రాజకీయాల్లో ఉత్కంఠ పెరిగింది. నర్సంపేటను అభివృద్ధి పథంలో నడిపించాలంటే నిజాయితీ, సేవాభావం కలిగిన బీజేపీ అభ్యర్థులకే ప్రజలు అవకాశం ఇవ్వాలని పార్టీ నాయకత్వం పిలుపునిచ్చింది. ఈ నామినేషన్ కార్యక్రమంలో వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంట రవికుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి, కంభంపాటి పుల్లారావు అభ్యర్థి తదితర జిల్లా ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అభ్యర్థులకు నామినేషన్ పత్రాలు అందజేసి, వారి వెంట నామినేషన్ల దాఖలులో పాల్గొని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.

అభివృద్ధే అజెండా

ఈ సందర్భంగా గంట రవికుమార్ మాట్లాడుతూ… నర్సంపేట మున్సిపాలిటీ అభివృద్ధి గత కొన్నేళ్లుగా నిర్లక్ష్యానికి గురైందన్నారు. తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, పారిశుధ్యం వంటి మౌలిక సమస్యలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయని, వీటికి శాశ్వత పరిష్కారం చూపే ప్రణాళిక బీజేపీ వద్ద సిద్ధంగా ఉందని చెప్పారు. మాటలకే పరిమితం కాకుండా, అమలు చేసే రాజకీయమే బీజేపీ ప్రత్యేకత అని పేర్కొన్నారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో ముందుకు సాగుతోందని, అదే అభివృద్ధి ఫలాలు స్థానిక సంస్థల ద్వారా ప్రజలకు అందాలంటే మున్సిపాలిటీల్లో కూడా బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు.

నిజాయితీగల పాలనకే ఓటు

బీజేపీ నాయకులు మాట్లాడుతూ… అవినీతి, అనైతిక రాజకీయాలకు నర్సంపేట ప్రజలు విసిగిపోయారని అన్నారు. మున్సిపాలిటీ స్థాయిలో పారదర్శక పాలన తీసుకురావాలంటే నిజాయితీగల బీజేపీ అభ్యర్థులకే ఓటు వేయాలని కోరారు. ప్రతి వార్డులో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా పనిచేసే అభ్యర్థులను బీజేపీ రంగంలోకి దింపిందని తెలిపారు. ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులంతా ఐక్యంగా పనిచేయాలని, వ్యక్తిగత ప్రయోజనాలకంటే పార్టీ, ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని నాయకత్వం సూచించింది.

ఇంటింటి ప్రచారానికి పిలుపు

రాబోయే రోజుల్లో ప్రచారం మరింత ఉధృతం చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఇంటికీ వెళ్లి బీజేపీ విధానాలు, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు వివరించాలని పిలుపునిచ్చారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేసి, మున్సిపాలిటీలో మార్పు తీసుకురావాల్సిన అవసరాన్ని వివరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నరసింహా రాములు, జిల్లా ఉపాధ్యక్షుడు రే శ్రీనివాస్, నర్సంపేట పట్టణ అధ్యక్షుడు గూడూరు సందీప్, రూరల్ అధ్యక్షుడు తనుగుల అంబేద్కర్, జిల్లా ఇన్చార్జీలు, పదాధికారులు, నియోజకవర్గ నాయకులు, పోటీ చేస్తున్న అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img