epaper
Tuesday, January 27, 2026
epaper

న‌ల్ల‌మ‌టు మత్తడి ధ్వంసం వెనుక మర్మమేంటి..?

న‌ల్ల‌మ‌టు మత్తడి ధ్వంసం వెనుక మర్మమేంటి..?
పదేపదే మత్తడి ధ్వంసం.. అధికారుల మౌనం
చివరి ఆయకట్టుకు నీరు లేక పంటలపై ప్రభావం
విచారణ కోరుతూ రుద్రగూడెం రహదారిపై రైతుల‌ రాస్తారోకో
తక్షణ చర్యలు చేప‌ట్ట‌క‌పోతే ఉద్యమం ఉధృతమంటూ హెచ్చ‌రిక‌

కాకతీయ, నల్లబెల్లి : వ‌రంగ‌ల్ జిల్లా నల్లబెల్లి మండలంలో సాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. రంగాయి చెరువు చివరి ఆయకట్టుకు నీరు అందకపోవడంతో రైతులు మంగళవారం రుద్రగూడెం రహదారిపై రాస్తారోకో చేపట్టారు. అయితే రైతుల ఆవేదన కేవలం నీటి కొరతకే పరిమితం కాకుండా, నల్లమట్టు చెరువు మత్తడి ధ్వంసం వెనుక దురుద్దేశాలు ఉన్నాయా? అనే అనుమానాలకు దారి తీసింది.
నల్లమట్టు చెరువులోని మత్తడి గత కొన్ని రోజులుగా పలుమార్లు ధ్వంసం కావడం రైతుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఒకసారి కాదు, వరుస ఘటనలుగా మత్తడి దెబ్బతింటున్నా ప్రభుత్వ యంత్రాంగం స్పందించకపోవడంపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. “ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు?” అన్న ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టత లేదని వారు విమర్శిస్తున్నారు.

నీరు లేక ఎండుతున్న పొలాలు
చివరి ఆయకట్టుకు సాగునీరు అందకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోయారు. పంటల కీలక సమయంలో కూడా నీటి సరఫరా చేయలేని పరిస్థితికి అధికారులే బాధ్యత వహించాలన్నారు. అధికారుల మౌనం అనుమానాలను మరింత బలపరుస్తోందని, సమస్యను ఉద్దేశపూర్వకంగా పట్టించుకోవడం లేదన్న భావన రైతుల్లో నెలకొందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఉన్నతస్థాయి విచారణ చేపట్టి మత్తడి ధ్వంసానికి కారణాలను గుర్తించాలని రైతులు డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, చెరువు చివరి ఆయకట్టువరకు సమానంగా సాగునీరు అందేలా తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. లేనిపక్షంలో మొదటి ఆయకట్టు–చివరి ఆయకట్టు రైతుల మధ్య విభేదాలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

పోలీసుల జోక్యంతో విరమణ
సమాచారం అందుకున్న ఎస్సై గోవర్ధన్ సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి దర్యాప్తు, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకోను విరమించారు. మొత్తానికి, నల్లమట్టు మత్తడి ధ్వంసం వెనుక నిజాలు వెలుగులోకి రావాలంటే తక్షణ, పారదర్శక విచారణే మార్గమని రైతులు స్పష్టం చేస్తున్నారు. సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఉద్యమం మరింత ఉధృతం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

చంద్రు తండకు చేరుకున్న పగిడిద్దరాజు

చంద్రు తండకు చేరుకున్న పగిడిద్దరాజు కాకతీయ, వ‌రంగ‌ల్ బ్యూరో : మహబూబాబాద్ జిల్లా...

నేడు మేడారంలో మహా జాతర ఆరంభం..!

నేడు మేడారంలో మహా జాతర ఆరంభం..! సారలమ్మ ఆగమనంతో వనదేవతల వేడుకలకు శ్రీకారం తొలిరోజు...

మేడారం పోదాం పదా..! చ‌లో..చ‌లో..

మేడారం పోదాం పదా..! చ‌లో..చ‌లో.. అన్ని దారులూ వ‌న‌దేవ‌త వైపే వాహ‌నాల‌తో కిక్కిరిసిపోతున్న ములుగు...

గేట్‌వే ఆఫ్ మేడారం

గేట్‌వే ఆఫ్ మేడారం మొదటి మొక్కులు గ‌ట్ట‌మ్మ త‌ల్లికే మేడారం యాత్రకు తొలి మెట్టు...

పార్కుల్లో గ్రీనరీపై బల్దియా ఫోకస్

పార్కుల్లో గ్రీనరీపై బల్దియా ఫోకస్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలి: మేయర్ సుధారాణి హార్టికల్చర్ అధికారులతో...

వ‌రంగ‌ల్ ప్రెస్ క్లబ్‌లో సంబరాలు

వ‌రంగ‌ల్ ప్రెస్ క్లబ్‌లో సంబరాలు డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ పునరుద్ధరణపై హ‌ర్షం స్పష్టత ఇవ్వకపోతే...

మద్ది మేడారం జాతరపై పోలీసుల‌ సమీక్ష

మద్ది మేడారం జాతరపై పోలీసుల‌ సమీక్ష భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు బందోబస్తులో అలసత్వం...

చికిత్స పొందుతూ యువకుడు మృతి

చికిత్స పొందుతూ యువకుడు మృతి కాకతీయ,రాయపర్తి : వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...
spot_img

Popular Categories

spot_imgspot_img