epaper
Sunday, January 25, 2026
epaper

మేడారం చిలకలగుట్టలో ఏర్పాట్లు

మేడారం చిలకలగుట్టలో ఏర్పాట్లు
క్షేత్ర‌స్థాయిలో ఎస్పీతో క‌లిసి మంత్రి సీత‌క్క ప‌రిశీల‌న‌
చిలకలగుట్టలో భక్తుల రాకపోకలపై అధికారుల‌కు సూచ‌న‌లు
ట్రైబల్ మ్యూజియం పనుల పురోగతిపై సమీక్ష
భక్తులకు లోటుపాట్లు లేకుండా ప్రత్యేక చర్యలు
భద్రతకే ప్రథమ ప్రాధాన్యం : మంత్రి సీత‌క్క‌

కాకతీయ, ములుగు ప్రతినిధి :శ్రీ సమ్మక్క–సారలమ్మ మహాజాతర సమీపిస్తున్న నేపథ్యంలో మేడారంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల ఏర్పాట్లను రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తయ్యేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర, జిల్లా ఎస్పీ *సుధీర్ రామ్‌నాథ్ కేకన్*లతో కలిసి మేడారం పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు.

చిలకలగుట్టలో ఏర్పాట్ల పరిశీలన

ముందుగా చిలకలగుట్ట ప్రాంతాన్ని సందర్శించిన మంత్రి, అక్కడ భక్తుల రాకపోకలు, భద్రతా ఏర్పాట్లు, తాగునీరు, రహదారులు తదితర మౌలిక సదుపాయాల పరిస్థితిని పరిశీలించారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అదనపు భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ట్రైబల్ మ్యూజియాన్ని సందర్శించిన మంత్రి, అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. జాతరకు వచ్చే భక్తులకు గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు తెలియజేసేలా మ్యూజియాన్ని సిద్ధం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, మద్యం సేవించి జంపన్న వాగులోకి వెళ్లవద్దని భక్తులకు హెచ్చరించారు. మేడారం చేరుకున్న వెంటనే జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి, అనంతరం అమ్మవార్ల దర్శనం చేసుకుని వంటావార్పు నిర్వహించుకోవాలని సూచించారు. రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో భక్తులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

చిన్నపిల్లలు, వృద్ధులపై ప్రత్యేక జాగ్రత్తలు

జాతర సమయంలో చిన్నపిల్లలు, వృద్ధులను ఒంటరిగా ఎక్కడికీ వదిలివేయకూడదని మంత్రి స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులు అందరూ కలిసే ఉండాలని, ఎవరికైనా దారి తప్పితే వెంటనే సమీపంలోని పోలీసు సిబ్బంది లేదా అధికారులను సంప్రదించాలని సూచించారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే మహాజాతరలో తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, దర్శన సౌకర్యాలు వంటి అంశాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా భక్తుల భద్రతకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సీతక్క మరోసారి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

హైలెవ‌ల్ వంతెన నిర్మాణ‌మెప్పుడు..?!

హైలెవ‌ల్ వంతెన నిర్మాణ‌మెప్పుడు..?! ప్రభుత్వాలు మారినా… పాలేరు తిప్పలు తీరవా! భారీ వర్షాలకు కొట్టుకుపోయిన...

అనాథ‌ వృద్ధులకు బాలవికాస అండ

అనాథ‌ వృద్ధులకు బాలవికాస అండ 50 మంది వృద్ధులకు నిత్యవసరాలు, బట్టలు అనాథ వృద్ధుల...

రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఈసీ మెంబర్‌గా గణేష్

రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఈసీ మెంబర్‌గా గణేష్ కాకతీయ, రాయపర్తి : మహబూబాబాద్...

పెద్దమ్మగడ్డ శ్రీకాంత్ కు పెద్ద పురస్కారం

పెద్దమ్మగడ్డ శ్రీకాంత్ కు పెద్ద పురస్కారం సామాజిక సేవలకు దక్కిన గౌరవం మహానంది అవార్డుతో...

మేడారం పనుల్లో అలసత్వం

మేడారం పనుల్లో అలసత్వం క్యూలైన్లు పూర్తి కాక‌పోవ‌డంతో భ‌క్తుల్లో ఆందోళన కొనసాగుతునే ఉన్న విద్యుత్...

వ‌రంగ‌ల్ కలెక్టర్‌కు రాష్ట్రస్థాయి అవార్డు

వ‌రంగ‌ల్ కలెక్టర్‌కు రాష్ట్రస్థాయి అవార్డు ఎన్నికల నిర్వహణలో ఉత్తమ కృషికి గుర్తింపు గ‌వ‌ర్న‌ర్ చేతుల...

వనదేవతలను ద‌ర్శించుకున్న ఎమ్మెల్యే య‌శ‌స్విని రెడ్డి

వనదేవతలను ద‌ర్శించుకున్న ఎమ్మెల్యే య‌శ‌స్విని రెడ్డి మేడారంలోయశస్విని,ఝాన్సీ రెడ్డి ప్రత్యేక పూజలు రాష్ట్ర,నియోజకవర్గ ప్రజలందరిని...

అభివృద్ధికి ఆమ‌డా దూరంలో అగ్రంపహాడ్ జాతర

అభివృద్ధికి ఆమ‌డా దూరంలో అగ్రంపహాడ్ జాతర మినీ మేడారంపై అధికారుల నిర్లక్ష్యం సౌకర్యాల లేమితో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...
spot_img

Popular Categories

spot_imgspot_img