epaper
Sunday, January 25, 2026
epaper

ఖమ్మంలో మహిళా క్రికెట్ సందడి

ఖమ్మంలో మహిళా క్రికెట్ సందడి
ఇందిరాగాంధీ సీనియర్ మహిళ టి–20 జాతీయ టోర్నమెంట్ ప్రారంభం
తమిళనాడు–ఉత్తరప్రదేశ్ మధ్య హోరాహోరీ పోరు
మీరంతా మరో మిథాలీ రాజ్ కావాలి
కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల నరేందర్

కాకతీయ, ఖమ్మం : క్రీడా స్ఫూర్తితో ఆడుతూ ముందుకు సాగుతూ మీరంతా మరో మిథాలీ రాజ్ కావాలని కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల నరేందర్ క్రీడాకారులకు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఎస్‌.ఆర్‌. అండ్‌ బి.జి.ఎన్‌.ఆర్‌. ప్రభుత్వ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న ఇందిరాగాంధీ సీనియర్ మహిళ టి–20 జాతీయస్థాయి మహిళా క్రికెట్ టోర్నమెంట్‌ను ఆమె అభినందించారు. ఈ టోర్నమెంట్ ఖమ్మం గడ్డపై జరగడం గర్వకారణమని పేర్కొన్నారు. ఆదివారం క్రీడాకారుల పరిచయ వేదిక అనంతరం టోర్నమెంట్‌ను అధికారికంగా ప్రారంభించిన మిక్కిలినేని మంజుల నరేందర్ మాట్లాడుతూ, క్రీడల్లో గెలుపు–ఓటములు సహజమని, ఓటమిని కూడా ఒక పాఠంగా తీసుకుని మరింత ముందుకు సాగాలని సూచించారు. క్రీడా రంగంలో క్రమశిక్షణ, పట్టుదల ఉంటే అంతర్జాతీయ స్థాయికి చేరుకోవడం సాధ్యమేనని అన్నారు.

క్రీడలకు ఖమ్మం ప్రత్యేక గుర్తింపు

ఖమ్మం జిల్లా ఉద్యమాలకు మాత్రమే కాకుండా కళాకారులు, క్రీడాకారులకు కూడా నిలయమని మంజుల నరేందర్ అన్నారు. చైతన్యవంతమైన ఖమ్మం జిల్లాను క్రీడా హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి వరకు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అవసరమైన వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. ఏడబ్ల్యుటి–20 సీఏ, ఖమ్మం క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ కోచ్, నిర్వాహకులు మహమ్మద్ మతీన్ సారధ్యంలో జాతీయస్థాయి మహిళా క్రికెట్ పోటీలు ఖమ్మం గడ్డపై నిర్వహించడం హర్షనీయమని పేర్కొన్నారు. పలు రాష్ట్రాల నుంచి క్రీడాపై ఉన్న మక్కువతో క్రీడాకారులు ఇక్కడికి రావడం చిన్న విషయం కాదని, ఈ టోర్నమెంట్‌ వారిలోని ప్రతిభను వెలికితీయడానికి దోహదపడుతుందని అన్నారు.

జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి

ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటున్న క్రీడాకారులు భవిష్యత్తులో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదగాలని మంజుల నరేందర్ ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరు లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి సాధన చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో సత్తా చాటడం సాధ్యమని తెలిపారు. టోర్నమెంట్ నిర్వహణకు ముందుకొచ్చిన దాతలు, ముఖ్యంగా రాజస్థాన్ మార్బుల్స్‌తో పాటు ఇతర సహకార దాతలకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. తొలుత జాతీయ గీతంతో టోర్నమెంట్‌ కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల నరేందర్ టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. తమిళనాడు వర్సెస్ ఉత్తరప్రదేశ్ జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఉత్తరప్రదేశ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్ జట్టు తమిళనాడు జట్టుపై విజయం సాధించింది. ఈ పోటీలను నాలుగు కెమెరాలతో డీఎన్‌బీ న్యూస్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం సీనియర్ నాయకులు నాగుల్ మీరా, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీధర్, మహిళా నాయకురాలు సుగుణ, రాజస్థాన్ మార్బుల్స్ అధినేత గుజ్జర్ బావర్‌జీ, ఖమ్మం క్రికెట్ అసోసియేషన్ కన్వీనర్ మహమ్మద్ మతీన్, ఆల్ ఇండియా టి–20 ఉమెన్ క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్ సందీప్ ఆర్య, కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీ సీనియర్ నాయకులు చోటేబాబా, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు సంతోష్ చక్రవర్తి పాల్గొన్నారు.
అలాగే అఫీషియల్ అంపైర్లు నైనా, ప్రియా, సంస్కృతి, సయ్యద్ పైసల్ అహ్మద్, సీనియర్ జర్నలిస్టు షేక్ జానీపాషా, టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దగ్గుపాటి మాధవ్, ఖమ్మం జిల్లా కెమెరామెన్ సంఘం అధ్యక్ష–ప్రధాన కార్యదర్శులు ఫయాజ్, గణేష్, ఉపాధ్యక్షులు అర్షద్, కోశాధికారి యూసఫ్, పవన్, యాసిన్ తదితరులు హాజరయ్యారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అన్ని రంగాల్లో మున్నూరు కాపుల సత్తా చాటాలి

అన్ని రంగాల్లో మున్నూరు కాపుల సత్తా చాటాలి మున్నూరుకాపు సంఘం సీనియర్ నాయకులు...

కొండపల్లి రాఘవరెడ్డిని పరామర్శించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

కొండపల్లి రాఘవరెడ్డిని పరామర్శించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కాకతీయ, ఖమ్మం ప్రతినిధి :...

ఉపాధి హక్కుపై కేంద్రం కత్తి!

ఉపాధి హక్కుపై కేంద్రం కత్తి! విబిజి రాంజీ చట్టం రద్దు చేయాలి ఖమ్మంలో కాంగ్రెస్...

సింగరేణి కార్మికులకు వడ్డీ లేని రుణం ఇవ్వాలి

సింగరేణి కార్మికులకు వడ్డీ లేని రుణం ఇవ్వాలి క్వార్టర్లు మాజీ కార్మికులకే కేటాయించాలి కేంద్ర...

యాదవులు రాజకీయ నిర్ణేత శక్తిగా ఎదగాలి

యాదవులు రాజకీయ నిర్ణేత శక్తిగా ఎదగాలి హక్కుల సాధనకు రాజకీయ బలం అవసరం మున్సిపల్...

ఐడీఓసీలో జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు

ఐడీఓసీలో జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు ఓటు హక్కుపై యువతలో అవగాహనే లక్ష్యం బీఎల్ఓల...

కొత్తగూడెం కార్పొరేషన్‌పై బీజేపీ జెండా ఎగ‌రాలి

కొత్తగూడెం కార్పొరేషన్‌పై బీజేపీ జెండా ఎగ‌రాలి అన్ని వార్డుల్లో అభ్యర్థులను నిలబెట్టండి గెలుపే లక్ష్యంగా...

మధిరలో సీఎం కప్ పోటీలు

మధిరలో సీఎం కప్ పోటీలు గ్రామీణ క్లస్టర్లలో ఉత్సాహంగా క్రీడలు ఒలింపిక్ స్థాయి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...
spot_img

Popular Categories

spot_imgspot_img